యువత.. ఇదిగో భవిత! | - | Sakshi
Sakshi News home page

యువత.. ఇదిగో భవిత!

Mar 20 2025 2:03 AM | Updated on Mar 20 2025 2:02 AM

తిరుపతి సిటీ : చంద్రబాబు సర్కార్‌ యువతను నట్టేట ముంచింది. నిరుద్యోగ భృతి లేదు.. జాబ్‌ క్యాలెండర్‌ మాటే మరిచింది.. ఏడాదిగా ఉద్యోగాల ఊసేలేదు. దీంతో ఏ చిన్న అవకాశం వచ్చినా యువత ఉపయోగించుకునేందుకు ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో ఉపాధి కల్పనే లక్ష్యంగా యూజీ పట్టభద్రులకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. అందులో భాగంగా శ్రీపీఎం ఇంటర్న్‌షిప్‌–2025శ్రీ ప్రవేశ పెట్టింది. సాంప్రదాయ కోర్సులలో డిగ్రీ పూర్తి చేసిన నిరుపేద అభ్యర్థులకు ఇండస్ట్రియల్‌ ఫీల్డ్‌లో ఇంటర్న్‌షిప్‌ కింద శిక్షణ అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఆసక్తిగల విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తిగలవారు ఈ నెల 31వ తేదీలోపు pminternrhip.mca.gov.in అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తోంది. ఈ క్రమంలోనే జిల్లావ్యాప్తంగా ఈ పథకానికి దాదాపు లక్ష మందికి అర్హత ఉన్నట్లు గుర్తించింది.

పకడ్బందీ శిక్షణ

పీఎం ఇంటర్న్‌షిప్‌ పథకంలో విద్యార్థులకు ఏడాది పాటు పరిశ్రమలలో పకడ్బందీ శిక్షణ అందించనున్నారు. ఈ సమయంలో ప్రతి నెలా రూ.5వేల స్టయిఫండ్‌ను నేరుగా అభ్యర్థి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్‌ అందిస్తారు. ఉపాధి, ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూల సమయంలో ఇంటర్న్‌షిప్‌ సర్టిఫికెట్‌ ఉపయోకరంగా ఉంటుంది.

విద్యార్థులకు వరం.. పీఎం ఇంటర్న్‌షిప్‌

నెలకు రూ.5వేల స్టయిఫండ్‌తో

ఏడాదిపాటు శిక్షణ

దరఖాస్తుకు ఈనెల 31 తుది గడువు

జిల్లాలో లక్ష మందికి అవకాశం

పథకానికి అర్హతలు ఇవీ..

ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, ఐటీఐ, డిప్లొమా కోర్సులు పూర్తి చేయడం

బీఏ, బీకాం, బీఎస్సీ ఉత్తీర్ణత

గుర్తింపు పొందిన వర్సిటీలు, విద్యాసంస్థల నుంచి రెగ్యులర్‌ కోర్సులు పూర్తి చేసి ఉండాలి

21 ఏళ్ల నుంచి 24 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.8లక్షల లోపు ఉండాలి.

యువత.. ఇదిగో భవిత!1
1/1

యువత.. ఇదిగో భవిత!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement