తిరుపతి రూరల్:మండలంలోని సి.గొల్లపల్లె వద్ద నిర్వహిస్తున్న భూముల రీ సర్వేను ఏపీ సర్వే సెటిల్మెంట్ ల్యాండ్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్.గోవిందరావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలు, రైతుల సహకారం, కొత్తగా తయారు చేసిన సర్వే రికార్డుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సి.గొల్లపల్లి రెవెన్యూ లెక్క దాఖలాలో ఎంత మేరకు భూముల రీసర్వే పూర్తి చేశారు, రైతులు నుంచి వస్తున్న సలహాలను ఆరా తీశారు. కార్యక్రమంలో జిల్లా సర్వేయర్తో పాటు తహసీల్దార్ రామాంజులు నాయక్ పాల్గొన్నారు.