శరవేగంగా చిన్నపిల్లల ఆస్పత్రి నిర్మాణం

రోగులతో మాట్లాడుతున్న చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి  - Sakshi

తిరుపతి తుడా : టీటీడీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిన్న పిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి వెల్లడివంచారు. శుక్రవారం శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయం, ఆస్పత్రి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. చీఫ్‌ సెక్రటరీ మాట్లాడుతూ డిసెంబర్‌ నాటికి ఆస్పత్రిలో ఆరురకాల సూపర్‌ స్పెషాలిటీ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అవసరాలకు అనుగుణంగా వైద్యులు, సిబ్బందిని నియమించుకుని, అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేయనున్నట్లు వివరించారు. అనంతరం హృదయాలయంలో జనరల్‌ వార్డులు, ఆపరేషన్‌ థియేటర్లను పరిశీలించారు. జేఈఓలు సదా భార్గవి, వీరబ్రహ్మం, డైరెక్టర్‌ శ్రీనాథరెడ్డి, ఆర్‌ఎంఓ భరత్‌ పాల్గొన్నారు.

Read latest Tirupati News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top