
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆదివారం 7,960 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 32 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 7.92 లక్షలకు చేరింది.
తాజాగా 40 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటివరకు 7.87 లక్షల మంది వైరస్ నుంచి బయటపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం 381 మంది కరోనా చికిత్స పొందుతున్నారు.