రైతును రాజు చేయడమే లక్ష్యం: హరీశ్‌రావు 

Minister Harish Rao Says Rs 50, 000 Crore Provided To Farmers Under Investment Assistance - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైతును రాజు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖమంత్రి హరీశ్‌రావు అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని పథకాలను సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నారని, రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.50 వేల కోట్లు అందజేశారని తెలిపారు.

ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో మంత్రిని ఉమ్మడి జిల్లాల డీసీఎంఎస్‌ చైర్మన్లు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా డీసీఎంఎస్‌ ౖచైర్మన్లు రైతులతో మమేకమై పని చేయాలని హరీశ్‌ సూచించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top