లక్షల బీర్లు మురిగాయంట! 

Lakhs Of Beers Wasted During Lockdown In Telangana - Sakshi

లాక్‌డౌన్‌ వేళ మద్యం దుకాణాల మూతే కారణం 

ఆ బీర్లకు సుంకం మినహాయించాలంటున్న బ్రేవరీలు 

ససేమిరా అంటున్న ఎక్సైజ్‌ వర్గాలు 

సాక్షి, హైదరాబాద్‌:  ఎక్సైజ్‌ శాఖకు కొత్త సమస్య వచ్చి పడింది. లాక్‌డౌన్‌ కాలానికి బార్‌ అండ్‌ రెస్టారెంట్ల లైసెన్స్‌ ఫీజు మినహాయింపు అంశం తేలకముందే మరోటి తెరపైకి వచ్చింది. కరోనా నిబంధనలు అమలైన సమయంలో తాము తయారు చేసిన లక్షల బీర్లు మురిగిపోయాయని, ఆ బీర్లకు సుంకం కట్టలేమని బ్రేవరీలంటున్నాయి. ఈ మేరకు ఆ సుంకాన్ని మినహాయించాలని కోరుతున్నాయి. కానీ, ఎక్సైజ్‌ వర్గాలు మాత్రం ఈ ప్రతిపాదనను నిరాకరిస్తున్నాయి. మార్చి 20 తర్వాత రెండున్నర నెలలు వైన్‌షాపులు, ఆరు నెలలకుపైగా బార్లు మూసేశారు. ఈ కాలంలో వైన్‌షాపులు, బార్లలో ఉన్న బీర్లు అలాగే ఉండిపోయాయి. అయితే, ఆ కాలంలో బ్రేవరీల్లో తయారు చేసిన బీర్లు కూడా నిల్వ ఉన్నాయి.

ఆ సుంకం విలువ సుమారు రూ.15 కోట్లు 
బీర్‌ కాలపరిమితి ఆరు నెలలే కావడంతో వైన్‌షాపులు తెరచిన తర్వాత బార్లలోని బీర్లను వైన్స్‌కు తరలించారు ఎక్సైజ్‌ అధికారులు. కానీ, బ్రేవరీల్లో పెద్ద ఎత్తున తయారైన లక్షల కేసుల బీర్లు అలాగే ఉండిపోయాయి. ఇప్పుడు ఆ బీర్లన్నీ మురిగిపోయాయని, వాటిని పారబోయాల్సి వస్తోందని, ఆ బీర్లకు తయారీ సుంకం కట్టలేమని బ్రేవరీలంటున్నాయి. ఈ విధంగా బ్రేవరీలు కట్టలేమని చెబుతున్న సుంకం విలువ రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్లు ఉంటుందని ఎక్సైజ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top