హైదరాబాద్: మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మౌలాలిలో దారుణం చోటు చేసుకుంది. కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట సింగిరెడ్డి మీన్ రెడ్డి (32)అనేవ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులు వ్యవహరించిన తీరుపై మనస్తాపంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో చోటు చేసుకున్నట్లు సమాచారం. మీన్ రెడ్డి దమ్మాయిగూడా నివాసిగా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. సింగిరెడ్డి మీన్ రెడ్డి డ్రంక్ అండ్ డ్రైవ్ లో మద్యం తాగిన రీడింగ్ 120 వచ్చిందని కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


