ఇది ఏఐ ఆధారిత ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లి ఏరియాలో శనివారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొత్తగా పెళ్లైన ఓ జంట బలవన్మరణానికి పాల్పడింది. ఒకరు విషం తీసుకోగా.. మరొకరు ఉరి వేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
మృతుల్ని కార్తీక్, మంజులగా గుర్తించారు. వీళ్లకు పెళ్లై రెండు నెలలే అయ్యిందని.. ఎంతో అన్యోన్యంగా ఉండేవారని చుట్టుపక్కల వాళ్లు చెబుతున్నారు. మృతుల నేపథ్యం.. మరణాలకు గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.


