సాక్షి, హైదరాబాద్: ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ పండుగ తేదీ ఖరారైంది. ఇవాళ నెలవంక కనిపించలేదు. దీంతో ముస్లింలు రేపు ఉపవాస ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఎల్లుండి(మార్చి 21, శనివారం) రంజాన్ పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోనున్నట్లు రుహిత్-ఎ-హిలాల్ కమిటీ అధికారికంగా ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా ఇవాళ నెలవంక కనిపించలేదు. దీంతో రంజాన్ మాసం (30 రోజులు) శుక్రవారంతో పూర్తి కానుంది. శనివారం ఉదయం 10 గంటలకు మసీదుల్లో ప్రత్యేక ఈద్ ప్రార్థనలు నిర్వహించనున్నారు.


