శాంతిటాకీస్‌కు నివాస్‌ కె. ప్రసన్న | - | Sakshi
Sakshi News home page

శాంతిటాకీస్‌కు నివాస్‌ కె. ప్రసన్న

Mar 28 2026 7:52 AM | Updated on Mar 28 2026 7:52 AM

తమిళసినిమా: కోలీవుడ్లో దూసుకొస్తున్న యువ సంగీత దర్శకుల్లో నివాస్‌ కె.ప్రసన్న ఒకరు. ఈయన ఇటీవల బైసన్‌ వంటి విజయవంతమైన చిత్రానికి సంగీతం అందించారు. ఇటీవల ఈయన సంగీతం అందించిన తాయ్‌ కిళవి చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. ఈ చిత్రాలకు నివాస్‌ కె ప్రసన్న సంగీతం పక్కా బలంగా అమిరింది. కాగా తాజాగా మరో కొత్త చిత్రానికి ఈయనే కమిట్‌ అయ్యారు. ఇంతకు ముందు మావీరన్‌, 3 పీహెచ్‌కే వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శాంతి టాకీస్‌ సంస్థ అధినేత అరుణ్‌ విశ్వనిర్మిస్తున్న 4వ చిత్రం షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమై శరవేగంగా జరుపుకుంటోంది. ఇందులో భారత్‌, కుటుంబస్తన్‌ చిత్రం ఫేమ్‌ శాన్వేమేఘ్నా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి హరిహర్‌సుదన్‌ అళగిరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి నివాస్‌ కె.ప్రసన్న సంగీతాన్ని అందిస్తున్నట్లు యూనిట్‌ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. మంచి కథా బలం ఉన్న చిత్రాలను నిర్మించే సంస్థగా పేరొందిన శాంతి టాకీస్‌ రూపొందిస్తున్న ఈ చిత్రం కూడా కథను మాత్రమే నమ్మి నిర్మిస్తున్నట్లు యూనిట్‌ సభ్యులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. చిత్ర షూటింగ్‌ను ఏకధాటిగా నిర్వహించి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. దీనికి తేనీఈశ్వర్‌ చాయాగ్రహణం అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement