తెన్కాసిలో సెన్సరీ పార్క్‌ | - | Sakshi
Sakshi News home page

తెన్కాసిలో సెన్సరీ పార్క్‌

Feb 1 2026 3:37 AM | Updated on Feb 1 2026 3:37 AM

తెన్కాసిలో సెన్సరీ పార్క్‌

తెన్కాసిలో సెన్సరీ పార్క్‌

సాక్షి, చైన్నె: వైకల్యాలు ఉన్న వ్యక్తుల సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ తెన్కాసి జిల్లా ఆయ కుడిలో కీలక అడుగుగా సెన్సరీ పార్క్‌ను ఏర్పాటు చేశారు. ఆస్ట్రేలియా ప్రభుత్వ మద్దతుతో అమర్‌ సేవా సంఘం ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ సెన్సరీ పార్క్‌ అభివృద్ధి చేసింది. ప్రకృతి ఆధారిత చికిత్స, సార్వత్రిక అంశాలు, పునరావాసాన్ని ఏకీకృతం చేస్తూ ఈ ఉద్యానవనం వైకల్యాలున్న పిల్లలు .పెద్దల శారీరక, మానసిక, సామాజిక అభివృద్ధికి దోహదం కానున్నది. ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో సమ్మిళిత, సమాజ ఆధారిత పునరావాసానికి ఒక మైలురాయిగా నిలిచే విధంగా రూపకల్పనచేశారు.

ఆస్ట్రేలియన్‌ ప్రభుత్వ విదేశీ వ్యవహారాలు , వాణిజ్య శాఖ నిధులతో, చైన్నెలోని ఆస్ట్రేలియన్‌ కాన్సులేట్‌–జనరల్‌ ద్వారా అమలు చేయబడిన ఈ ప్రాజెక్టుకు రూ. 8 లక్షల గ్రాంట్‌ అందించారు. సెన్సరీ పార్క్‌ను చైన్నెలోని ఆస్ట్రేలియన్‌ కాన్సులేట్‌–జనరల్‌ డిప్యూటీ కాన్సుల్‌ జనరల్‌ కామెరాన్‌ నోబుల్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైకల్యాలున్న వ్యక్తులు తమ పూర్తి సామర్థ్యాన్ని సాధించేందుకు అనుకూలమైన సమ్మిళిత సమాజాలను నిర్మించడంలో కట్టుబడి ఉన్నామన్నారు. ఈ ప్రాజెక్టు ఆస్ట్రేలియా అంతర్జాతీయ వైకల్య సమానత్వం. హక్కులకు అనుగుణంగా ఉందని పేర్కొన్నారు. అమర్‌ సేవా సంఘం ప్రమోటర్‌, కో–చైర్మన్‌ ఎస్‌. శంకర రామన్‌ మాట్లాడుతూ, ‘‘ఈ సెన్సరీ పార్క్‌ మేధో , అభివృద్ధి ప్రాజెక్టు అని పేర్కొంటూ, వైకల్యాలున్న పిల్లలు, పెద్దలకు ఒక అభయ హస్తంగా ఉంటుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తెన్కాసి జిల్లా కలెక్టర్‌ కమల్‌ కి షోర్‌, పద్మశ్రీ అవార్డు గ్రహీత, మాజీ సీబీఐ డైరెక్టర్‌ డి.ఆర్‌. కార్తికేయన్‌, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ టీఎస్‌ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement