సంక్రాంతి.. సంబరం | - | Sakshi
Sakshi News home page

సంక్రాంతి.. సంబరం

Jan 15 2026 8:43 AM | Updated on Jan 15 2026 8:43 AM

సంక్ర

సంక్రాంతి.. సంబరం

రాష్ట్రవ్యాప్తంగా భోగి వేడుకలు కోలాహలంగా పండుగ తప్పెట్లు, డప్పులతో సందడి కప్పేసిన పొగ, మంచు విమాన సేవలకు ఆటంకం

ఇళ్ల ముంగిట భోగి మంటలు

ముగ్గులతో ఆకట్టుకుంటున్న వళ్లియమ్మాళ్‌ కళాశాల యువతులు

సాక్షి, చైన్నె: ఇంటిళ్లి పాది ఆనందోత్సాహాలతో జరుపుకునే పెద్ద పండగ రానే వచ్చింది. ఇందులో తొలి రోజైన బుధవారం ఇంటి ముంగిళ్లల్లో భోగి మంటలు ఎగసి పడ్డాయి. వేకువ జామున ఇళ్లలోని పాత, పనికి రాని వస్తువుల్ని భోగి మంటల్లో ప్రజలు వేశారు. తమ తమ ఇళ్ల ముందు, బహుళ అంతస్తులు, అపార్ట్‌మెంట్ల ముంగిట భోగి మంటలతో ఆనందాన్ని పంచుకున్నారు. కొన్ని చోట్ల ఇళ్లలోని పాతచాపలు, చీపుర్లు , అట్ట పెట్టెలు వంటి పాత వస్తువులను భోగి మంటలలో వేసి పర్యావరణాన్ని ఆటకం కల్గించ కుండా సంబరాలు చేసుకున్నారు. పిల్లలు, యువకులు తప్పెట్లను వాయిస్తూ, భోగే..భోగి నినాదంతో తమ తమ ప్రాంతాలను చుట్టి వచ్చారు. మరికొన్ని చోట్ల కొయ్య చెక్కలను పేర్చి మంటలు వేశారు. ఓ వైపు మంచు, మరోవైపు భోగి మంటల పొగ కప్పెయడంతో ఉదయాన్నే చైన్నె వంటి నగరాలలో వాహన చోదకులు ఇబ్బందులు తప్పలేదు. పొంగ కప్పేయడంతో వాకర్లకు అవస్థలు తప్పలేదు. అలాగే, ఉదయాన్నే చైన్నెకు రావాల్సిన, బయలు దేరాల్సిన అనేక విమానాల సేవలకు ఆటంకం తప్పలేదు. రైళ్లు సైతం ఆలస్యంగా వచ్చాయి. విమానాశ్రయ పరిసర ప్రాంతాలలో ఎగసి పడ్డ భోగిమంటల పొగ విమానాలకు సెగగా మారింది. ఆకాశాన్ని మంచు, పొగ కప్పేసింది. 14 విమానాల సేవలు రద్దు కాగా, 30 విమానాల సేవలు 3 గంటలు ఆలస్యంగా జరిగాయి. రాష్ట్రంలోని తిరుచ్చి, మదురై, కోయంబత్తూరు, తూత్తుకుడికి వెళ్లే విమానాలన్నీ పూర్తిస్థాయి ప్రయాణికులతో చైన్నె నుంచి బయలుదేరి వెళ్లాయి. ఇక, భోగిరోజున మాంసాహారం స్వీకరించే వారు అధికం కావడంతో చేపల మార్కెట్లు, చికెన్‌, మటన్‌ సెంటర్లు కిట కిటలాడాయి.

నేడు జల్లికట్టుకు శ్రీకారం

తమిళుల వీరత్వాన్ని చాటే జల్లికట్టుకు మదురై జిల్లా అవనియాపురంలో మంగళవారం శ్రీకారం చుట్టనున్నారు. ఆంక్షలు, నిబంధనలకు అనుగుణంగా రంకెలు వేయడానికి బసవన్నలు, వాటి పొగరు అణిచేందుకు క్రీడాకారులు సిద్ధమయ్యారు. శుక్రవారం పాలమేడులో, శనివారం అలంగానల్లూరులో జల్లికట్టు రంకెలు వేయనున్నది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఈ మూడు ప్రాంతాలలో జల్లికట్టు నిమ్తితం క్రీడాకారులు తమపేర్లను ఇప్పటికే నమోదుచేసుకున్నారు. ఎద్దుల యజమానులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నప్పటికీ, సమగ్ర పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం వాడి వాసల్‌ వైపుగా ఎద్దులను అనుమతించనున్నారు. తొలి జల్లికట్టు అవనియాపురంలో జరగనున్నడంతో ఇక్కడ సర్వం సిద్ధం చేశారు. 3 వేల ఎద్దులు, 1,949 మంది క్రీడాకారులు ఇక్కడ తమ వీరతాన్ని చాటుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ పోటీలలో అవనీయాపురం వాసులకు అన్యాయం తలబెట్టారంటూ అక్కడి ఎద్దులయజమానులు ఆందోళనకు దిగడంతో వారిని కట్టడి చేయడానికి పోలీసులు శ్రమించారు. ఇక ఎద్దులు, క్రీడాకారులకు నిర్ణీత సమయం కేటాయిస్తూ, జట్టులు జట్టులుగా కదనరంగంలోకి వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. అవకతవకలకు ఆస్కారం ఇవ్వకుండా క్యూ ఆర్‌ కోడ్‌ కేటాయించారు. అలాగే, ఇక్కడ ఆల్‌ రౌండర్‌ విజేతకు కారు, ఎద్దు యజమానికి ట్రాక్టర్‌ను బహుమతిగాఇచ్చేందుకు సిద్ధమయ్యారు.

నేతల శుభాకాంక్షలు..

సంక్రాంతి పండుగను ప్రజలు ఆనందోత్సాహలతో జరుపుకోవాలని నేతలు ఆకాంక్షించారు. గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి, సీఎం ఎంకే స్టాలిన్‌, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి, మాజీ సీఎం పన్నీరు సెల్వం, టీవీకే నేత విజయ్‌, ఎండీఎంకే నేత వైగో, కాంగ్రెస్‌ నేత సెల్వ పెరుంతొగై, అమ్మ మక్కల్‌ కళగం నేత దినకరన్‌, సీపీఐ నేత వీర పాండియన్‌, సీపీఎం నేత షణ్ముగం, వీసీకే నేత తిరుమావళవన్‌, బీజేపీ నేత నైనార్‌ నాగేంద్రన్‌, తమిళ మానిల కాంగ్రెస్‌ నేత జికే వాసన్‌, పిఎంకే నేతలు రాందాసు, అన్బుమణి రాందాసు తదితరులు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంటిళ్లి పాది ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. అందరి జీవితాలలో వెలుగు నిండాలని, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని పేర్కొన్నారు.

ముగ్గులతో ఆకట్టుకుంటున్న యువతులు, భోగి వేళ తప్పట్ల హోరు

భాగ్యాలనిచ్చే భోగి, సరదాలనిచ్చే సంక్రాంతి, కమ్మని కనుమ సంబరాలతో పెద్ద పండుగ రానే వచ్చింది. ఇందులో తొలి రోజైన బుధవారం వేకువ జామున ఇళ్ల ముంగిళ్లల్లో భోగి మంటలు ఎగసి పడ్డాయి. భోగే భోగి అంటూ యువత, పిల్లలు తప్పెట్లు, డప్పుల హోరుతో సందడి చేశారు. పొగ వైపు, మంచు మరోవైపు వెరసి చైన్నెలో విమాన సేవలకు ఆటంకాలు సృష్టించాయి. గురువారం ఇంటిళ్లి పాది ఆనందోత్సాహాలతో సంక్రాంతి సంబరాలు జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. అలాగే వీరత్వానికి ప్రతీకగా ఉన్న జల్లికట్టు వీరపట్టుకు అవనీయాపురంలో శ్రీకారం చుట్టనున్నారు.

సర్వం సిద్ధం..

పెద్ద పండుగలో భాగంగా సంక్రాంతిని గురువారం జరుపుకునేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధం అయ్యారు. బుధవారం కూడా షాపింగ్‌ మాల్స్‌లలో జనం కిక్కిరిశారు. కోయంబేడు, ప్యారిస్‌, తాంబరం, పురసైవాక్కం తదితర మార్కెటల్లో సంక్రాంతి పూజా సామగ్రి విక్రయాలు, పొంగళ్లు పెట్టేందుకు కుండల కొనుగోలు జోరుగానే సాగింది. అయితే, వీటి ధరలకు రెక్కలు వచ్చాయి. చెరుకు కట్ట రూ. 400, పసుపు కట్ట రూ. 80, అరటి పండు గెల రూ. 250కు పైగా ధర పలికింది. పువ్వుల ధరలు అమాంతంగా పెరిగాయి. అన్ని రకాల పువ్వుల ధర కిలో రూ. 2000 నుంచి 7 వేల వరకు పలికాయి. రాష్ట్రంలోని ఇతర మార్కెట్లలో పండుగ షాపింగ్‌ జోరుగానే జరిగింది. ఈ పండుగకు ఐదారు రోజులు సెలవులు కలిసి రావడంతో వివిధ ప్రాంతాలలో ఉన్న వాళ్లంతా తమ తమ స్వగ్రామాలకు చేరుకుని కుటుంబాలతో ఆనందంగా గడిపే పనిలో పడ్డారు. చైన్నె నుంచి గత నాలుగు రోజులలో పది లక్షల మందికి పైగా చైన్నె నుంచి స్వస్థలాలకు తరలి వెళ్లారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం వేకువ జామున వరకు బస్సులు కిక్కిరిసి రోడ్డెక్కడంతో జాతీయ రహదారిలో ట్రాపిక్‌ రద్దీ పెరిగింది. కిలాంబాక్కం తదితర బస్టాండ్‌లో రవాణశాఖ మంత్రి శివశంకర్‌ విస్తృతంగా పర్యటించి ప్రయాణీకులకు ఇబ్బందులు కలుగకుండా పర్యవేక్షించారు.

సంక్రాంతి.. సంబరం1
1/10

సంక్రాంతి.. సంబరం

సంక్రాంతి.. సంబరం2
2/10

సంక్రాంతి.. సంబరం

సంక్రాంతి.. సంబరం3
3/10

సంక్రాంతి.. సంబరం

సంక్రాంతి.. సంబరం4
4/10

సంక్రాంతి.. సంబరం

సంక్రాంతి.. సంబరం5
5/10

సంక్రాంతి.. సంబరం

సంక్రాంతి.. సంబరం6
6/10

సంక్రాంతి.. సంబరం

సంక్రాంతి.. సంబరం7
7/10

సంక్రాంతి.. సంబరం

సంక్రాంతి.. సంబరం8
8/10

సంక్రాంతి.. సంబరం

సంక్రాంతి.. సంబరం9
9/10

సంక్రాంతి.. సంబరం

సంక్రాంతి.. సంబరం10
10/10

సంక్రాంతి.. సంబరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement