14 ఏళ్ల తర్వాత.. | - | Sakshi
Sakshi News home page

14 ఏళ్ల తర్వాత..

Dec 23 2025 7:24 AM | Updated on Dec 23 2025 7:24 AM

14 ఏళ్ల తర్వాత..

14 ఏళ్ల తర్వాత..

● ముల్లపెరియార్‌ ఆనకట్టపై సర్వే ప్రారంభం

కొరుక్కుపేట: పద్నాలుగేళ్ల తరువాత ముల్‌లై పెరియార్‌ డ్యాం సబ్మెర్సిబుల్‌ సర్వే ఎట్టకేలకు ప్రారంభమైంది. 12 రోజులు పాటూ ఈ సర్వే జరుగుతుందని అధికారులు వెల్లడించారు. వివరాలు.. ముల్లపెరియార్‌ ఆనకట్ట ద్వారా తేని, దిండిగల్‌, మధురై, శివగంగ తదితర ఐదు జిల్లాలు తాగునీరు, నీటిపారుదల సౌకర్యాలను పొందుతాయి. ఆనకట్ట కేరళలో ఉన్నప్పటికీ, ఆనకట్ట నిర్వహణ 99 సంవత్సరాల లీజు ప్రాతిపదికన ఉంది. నీటి వినియోగ హక్కులు, నీటి విడుదల, నిర్వహణ తమిళనాడు ప్రభుత్వ ప్రజా పనుల శాఖ ఆధీనంలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పెరియార్‌ ఆనకట్ట 60 సంవత్సరాలకు పైగా శిథిలావస్థలో ఉంది. కేరళ ప్రభుత్వం, అక్కడి కొన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు దానిని కూల్చివేసి కొత్త ఆనకట్ట నిర్మించాలని నిరంతరం తమ గళాన్ని వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితిలో, ఆనకట్ట బలాన్ని పరీక్షించడానికి, విస్తృతమైన సర్వేలు నిర్వహించడానికి 2011లో రిమోట్‌గా ఆపరేటెడ్‌ వాహనాన్ని ఉపయోగించారు. సుప్రీంకోర్టు, దాని న్యాయమూర్తులు కూడా ఆనకట్ట బలంగా ఉందని, దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తీర్పు ఇచ్చారు. దాని ఆధారంగా వివిధ ఆదేశాలు, మార్గదర్శకాలను జారీ చేశారు.

నేటి నుంచి 12 రోజులు పాటూ..

శ్రీలంకలోని సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటీరియల్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి అత్యాధునిక ఖనిజలాంతర్గామిని తీసుకువచ్చారు.ె అయితే కేరళ ప్రభుత్వం ఆనకట్ట తెగిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తోంది. ఈ విషయంలో సుప్రీంకోర్టులో కూడా అనేక కేసులు దాఖలవుతున్నాయి. దీని ఆధారంగా జరిగిన ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశం ప్రకారం, యూనియన్‌ మానిటరింగ్‌ కమిటీ నవంబర్‌ 10న పెరియార్‌ ఆనకట్టను పరిశీలించింది. తరువాత మధురైలో జరిగిన తనిఖీ, సంప్రదింపుల సమావేశంలో, తమిళనాడు ప్రజా పనులశాఖ పెరియార్‌ ఆనకట్ట బలోపేతం చేసే పనిని నిర్వహించడానికి వీలుగా ఆధునిక పరికరాన్ని ఉపయోగించి ఆనకట్టను తనిఖీ చేయాలని రెండు రాష్ట్ర అధికారుల సమ్మతితో నిర్ణయించారు. దీనికి ప్రతిస్పందనగా, 14 సంవత్సరాల తర్వాత పెరియార్‌ ఆనకట్ట రెండవ తనిఖీని ఢిల్లీలో భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్వహించింది. ఈ అధ్యయనం కోసం, డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, చంద్ర బృందంతో సంబంధం ఉన్న ఇద్దరు రాష్ట్ర అధికారులు సోమవారం ఉదయం తెక్కడి బోట్‌హౌస్‌ నుంచి ముల్‌లైపెరియార్‌ ఆనకట్టకు బయలుదేరారు. వారు 250 మీటర్ల లోతులో ప్రధాన ఆనకట్ట నీటి అడుగున సర్వే నిర్వహిస్తున్నారు. ఆనకట్ట ప్రాంతంలో రోజుకు గరిష్టంగా 20 మీటర్లు మాత్రమే సర్వే చేయవచ్చు. దీంతో ఈ సర్వే 10 నుంచి 12 రోజుల పాటూ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement