
● ఒప్పందాలు
టెలికాం మౌళిక సదుపాయాల రంగానికి ఒక మైలు రాయిగా సస్టైనబుల్ గ్లాస్ ఫైబర్ రీన్పోర్స్డ్ పాలిమర్ స్ట్రక్చర్ కోసం అధునాతన పదార్థాలు, మార్గదర్శక పరిశోధన కోసం ఇండస్ టవర్స్ , ఐఐటీ మద్రాసులు భాగస్వామ్యంతో ముందుకు వెళ్లనున్నాయి. ఈ పరిశోధన అప్లికేషన్ కోసం బలమైన డిజైన్, భద్రతా ప్రమాణాల ఏర్పాటు దిశగా మంగళవారం ఒప్పందాలు జరిగాయి. ఇండస్ టవర్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అనిల్గుప్తా, ఐఐటీ మద్రాసు ప్రొఫెసర్ రవీంద్ర గెట్టు, ఐఐటీ మద్రాసు డీన్ అశ్విన్ మహాలింగంలు ఈ ఒప్పందాలపై సంకతాలు చేశారు. ఈ సహకారం అత్యాధునిక ఆవిష్కరణలను స్కేలబుల్ సొల్యూషన్స్గా ఎలా అనువధిస్తాయో, పరిశోదన, వాస్తవ ప్రపంచ ప్రభాం మధ అంతరాన్ని ఎలా తగ్గిస్తాయో అని ఈ సందర్భంగా వారు వివరించారు. – సాక్షి, చైన్నె