
క్లుప్తంగా
తమిళసినిమా: తను కంపోజ్ చేసిన చిత్రాలను ఇతరులు తన అనుమతి లేకుండా వాడితే ఇళయరాజా వారిపై చర్యలు తీసుకోవడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు. కోర్టుకెళ్లి అయినా పోరాటం చేస్తున్నారు. అలా ఆయన తాజాగా గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంపై చైన్నె హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. నటుడు అజిత్, త్రిష జంటగా నటించిన చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. జీవీ ప్రకాశ్కుమార్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఈ ఏడాది ప్రారంభంతో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో ఇళయరాజా సంగీతాన్ని అందించిన చిత్రాల్లోని పాటలను ఆయన అనుమతి లేకుండా వాడుకున్నారు. దీంతో ఇళయరాజా ఈ విషయంలో మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 8న విచారణ జరగనుంది.
తిరుత్తణి: టీవీకే పార్టీకి చెందిన 25 మంది యువకులు ఎమ్మెల్యే చంద్రన్ సమక్షంలో శుక్రవారం డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీలు ఎన్నికల ప్రచారానికి పదునుపెట్టాయి. చేరికలు, వైదొలగడంలో పార్టీ నాయకులు ఆసక్తి చూపు తున్నారు. ఇందులో భాగంగా తిరువలంగాడు మండలానికి చెందిన విజయ్ పార్టీకి చెందిన యువకులు 25 మంది డీఎంకేలో చేరే కార్యక్రమం మండల డీఎంకే కార్యదర్శి విజయ్కుమార్ సమక్షంలో నిర్వహించారు. జిల్లా డీఎంకే కార్యదర్శి, ఎమ్మెల్యే చంద్రన్ సమక్షంలో యువకులు 25 మందిని డీఎంకేలో సభ్యులుగా చేర్చుకున్నారు. ఈ సందర్భంగా యువకులకు ఎమ్మెల్యే చంద్రన్ శాలువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డీఎంకేలో భవిత యువతదే అన్నారు.
కొరుక్కుపేట: టైటిల్ డీడ్ సహా పత్రాలు పోతే అధికారులపై చర్యలు తప్పవని రాష్ట్ర సమాచార కమిషనర్ ఆర్.ప్రియకుమార్ అన్నారు. చైన్నె, సెట్, కోయంబత్తూరుకు చెందిన అన్బువేల్ అనే వ్యక్తి చైన్నెలోని రాష్ట్ర సమాచార కమిషనర్కు సమాచార హక్కు చట్టం కింద అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో పేరూర్ తాలూకాలోని వాడవల్లి గ్రామంలోని భూమికి సంబంధించి కోయంబత్తూరు జిల్లా రెవెన్యూ కమిషనర్ ఫైల్ను అన్బు యాక్సెస్ చేయాలని కోరారు. డిసెంబర్ 5న, పిటిషన్ను విచారించిన రాష్ట్ర సమాచార కమిషనర్ ఆర్.ప్రియకుమార్, పిటిషనర్ శోధనలో అభ్యర్థించిన సమాచారం ఉన్న ఫైల్ అందుబాటులో లేదని కనుగొన్నారు. ఫైల్ అందుబాటులో లేదని, సమాచార అధికారి అందించిన సమాచారాన్ని అంగీకరించడానికి కమిషన్ నిరాకరించింది. ఫైల్ అందుబాటులో లేదని పబ్లిక్ అథారిటీకి తెలియజేస్తుంది. దీంతో రాష్ట్ర సమాచార కమిషన్ ఆదేశాల మేరకు అన్ని స్థాయిల కార్యాలయాలు అజాగ్రత్త వహిస్తున్నారని ఇలాగే సాగితే వారిపై చర్యలు తప్పవని కమిషనర్ ఆర్. ప్రియకుమార్ వెల్లడించారు.
తిరువొత్తియూరు: రవాణా, రహదారి భద్రతా కమిషనర్ ఒక విడుదల చేశారు. మిలాద్–ఉన్–నబి వరుస వారాంతపు సెలవులను పురస్కరించుకుని ప్రజలు బయటి ప్రాంతాలకు ప్రయాణించడానికి ప్రైవేట్ ఆమ్ని బస్సులను వినియోగించుకుంటారు. ఈ సమయంలో ప్రైవేట్ ఆమ్మీ బస్సులు అధిక ఛార్జీలు వసూలు చేస్తే, దానిని అరికట్టడానికి తమిళనాడు అంతటా ప్రాంతీయ రవాణా అధికారులు, మోటారు వాహనాల తనిఖీ అధికారులు, రవాణా తనిఖీ చెక్ పోస్ట్ అధికారులు కలిసి ఒక ప్రత్యేక బందాన్ని ఏర్పాటు చేశారు. అధిక చార్జీలు వసూలు చేసే ఆమ్ని బస్సులను తనిఖీ చేసి, జరిమానాలు విధించి, వాహనాలను స్వాధీనం చేసుకుని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
అన్నానగర్: తూత్తుకుడి జిల్లాలోని కోవిల్పట్టి సమీపంలోని ఇలుప్పయురాని ఎన్జీఓ కాలనీకి చెందిన గణేషన్ కుమారుడు మారిచెల్వం (31). ఇతను కోవిల్పట్టి రైల్వేస్టేషన్లోని ఆటోస్టాండ్లో ఆటో నడుపుతూ ఉండేవాడు. శుక్రవారం ఉదయం, షణ్ముగనగర్ శ్మశానవాటికలో ఆటోడ్రైవర్ మారిచెల్వం రక్తపు గాయాలతో హత్యకు గురయ్యాడు. అతని ఆటో కొద్ది దూరంలో ఆగి ఉంది. ఇది చూసిన స్థానికులు కోవిల్పట్టి తూర్పు పోలీస్స్టేషన్కు సమా చారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మారిసెల్వం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం కోవిల్పట్టి ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. ఆటోను కోవిల్పట్టి తూర్పు పోలీస్స్టేషన్కు తీసుకొచ్చారు. పోలీ సులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

క్లుప్తంగా