రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం

Aug 26 2025 7:32 AM | Updated on Aug 26 2025 12:36 PM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి రికార్డు సృష్టించిన సంగీత పాఠశాల విద్యార్థుల గ్రీవెన్స్‌లో వినతుల స్వీకరణ రాష్ట్రస్థాయి రన్నింగ్‌ పోటీలకు విద్యార్థిని

అన్నానగర్‌: పుదుక్కోట్టైలోని పూంచోలై నగర్‌ ప్రాంతానికి దక్షిణ మూర్తి (70 ), ఇతను రిటైర్డ్‌ పోలీసు అధికారి. దేవరాజ్‌ (58) అదే ప్రాంత నివాసి. ఇద్దరూ రామేశ్వరం వెళ్లారు. సోమవారం ఇద్దరూ పుదుక్కోట్టై వెళ్లడానికి కారులో బయలుదేరారు. దక్షిణమూర్తి కారు నడుపుతున్నాడు. రామనాథపురం జిల్లాలోని ఆర్‌.ఎస్‌. మంగళం సమీపంలోని కలకుడి బైపాస్‌ రోడ్డు వద్దకు చేరుకుంటుండగా, కారు అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి అక్కడి ఫ్లైఓవర్‌ రిటైనింగ్‌ వాల్‌ ను ఢీకొట్టింది. దీంతో ప్రమాదం జరిగింది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు శిథిలాలలో చిక్కుకుని ప్రాణాలతో పోరాడుతున్నారు. వారిద్దరూ ఆసుపత్రికి తరలిస్తుండగా విషాదకరంగా మరణించారు. మృతుడు దక్షిణామూర్తి కుమారుడు మధన్‌. ఇతను నూడుల్స్‌ చిత్రానికి దర్శకత్వం వహించి నటించడం గమనార్హం.

అన్నానగర్‌: చైన్నెలోని ముగప్పేర్‌లోని ఓ ప్రైవేట్‌ సంగీత పాఠశాల ప్రాంగణంలో, ఇళయరాజా సంగీతంలో సాధించిన వివిధ విజయాలను చూసి గర్వపడేలా, సంగీత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సహా 1000 మందికి పైగా కలిసి ‘ది మ్యూజిక్‌’ పేరుతో ఇళయరాజా రూపంలో నిలబడి రికార్డు సృష్ట్టించారు. ఇది యూనికో రికార్డ్‌ పుస్తకంలో ప్రపంచ రికార్డుగా గుర్తించబడింది. దీనికి సంబంధించిన సర్టిఫికెట్‌ను ఆదాయపు పన్ను అసిస్టెంట్‌ కమిషనర్‌ రాజ్‌కుమార్‌ అందజేశారు. పాల్గొన్న వారందరికీ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.

వేలూరు: సోమవారం ఉదయం కలెక్టరేట్‌లో డీఆర్‌ఓ మాలతి అధ్యక్షతన ప్రజా విన్నపాల దినోత్సవం జరిగింది. ఇందులో వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ప్రజలు ఇచ్చిన వినతులను స్వీకరించారు. దీంతో జిల్లా నలు మూలల నుంచి ప్రజలు వివిధ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్బంగా అనకట్టు నియోజక వర్గం పదుపట్టుపాళ్యం గ్రామానికి చెందిన సంగీత ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న విధంగా తన భర్తకు సొంతమైన ఆస్తులతో పాటు వ్యవసాయ భూమిని అతని సోదరులు అక్రమంగా పట్టాదారు పాసు పుస్తకాలు చేసుకొని తనకు ఆస్తులు లేకుండా చేశారని ఆరోపించారు. అదేవిధంగా వినతులను స్వీకరించిన డీఆర్‌ఓ విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వినతి పత్రాలను స్వీకరించి వికలాంగులకు, లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను అక్కడిక్కడే అందజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

తిరుత్తణి: తిరువళ్లూరు జిల్లా స్థాయిలో పాఠశాల విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆవడిలోని బెటాలియన్‌ మైదానంలో విద్యార్థులకు అథ్లెటిక్‌ పోటీలు నిర్వహించారు. ఇందులో తిరుత్తణి సమీపంలోని కేజీ.కండ్రిగ ప్రభుత్వ మహోన్నత పాఠశాల ప్లస్‌టూ విద్యార్థిని గోమతి పాల్గొని, రన్నింగ్‌ రేస్‌ పోటీల్లో 3000 మీటర్లు, 800 మీటర్ల విభాగంలో జిల్లా స్థాయిలో టాపర్‌గా విజయం సాధించింది. ఆమెను జిల్లా మంత్రి నాసర్‌ సన్మానించి, సర్టిఫికెట్లు అందజేశారు. రాష్ట్ర స్థాయిలో విద్యార్థులకు నిర్వహించనున్న అథ్లెటిక్‌ పోటీల్లో పాల్గొననున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని గోమతిని ఆ పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. రాష్ట్ర స్థాయిలో విజయం సాధించాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement