12 మంది పెరుమాళ్లకు గరుడ సేవ | - | Sakshi
Sakshi News home page

12 మంది పెరుమాళ్లకు గరుడ సేవ

May 2 2025 1:51 AM | Updated on May 2 2025 1:51 AM

12 మంది పెరుమాళ్లకు గరుడ సేవ

12 మంది పెరుమాళ్లకు గరుడ సేవ

● ఎదురుగా ఆంజనేయ స్వామి దర్శనం ● తరలివచ్చిన భక్తజనం

సేలం: కుంభకోణంలో ఏటా చిత్ర మాసంలో అక్షయతృతీయ రోజున కుంభకోణంతో పాటూ 12 గరుడ వాహనాలలో పెరుమాల్‌ అదిష్టించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించడం ఆనవాయితి. ఈ మేరకు బుధవారం అక్షయ తృతీయను పురస్కరించుకుని 12 గరుడ వాహన సేవ సందర్భంగా నగరంలో ముఖ్య వీధి టీఎస్‌ఆర్‌ పెరియవీధిలో ఉన్న అహోబిల మఠం వద్ద బ్రాహ్మండమైన పందిళ్లను వేశారు. ఉదయం 10 గంటల సమయంలో గరుడోత్సవాన్ని నిర్వహించారు. ఇందులో సారంగపాణి, చక్రపాణి, రామస్వామి, ఆదివరాహ స్వామి, రాజగోపాల స్వామి, కొట్టియూర్‌ నవనీతకృష్ణన్‌ స్వామి, మేల్‌కావేరి వరదరాజ పెరుమార్‌ స్వామి, అహోబిళం మఠం లక్ష్మీనరసింహస్వామి, శీనివాస పెరుమాల్‌, వేణిగోపాల స్వామి, సోలయప్పన్‌ తెరురామస్వామి, భట్టాఛార్యులు, నవనీత కృష్ణన్‌ వంటి 12 ఆలయాలలో నుంచి వేరు వేరుగా తీసుకువచ్చిన ఉత్సవమూర్తులు గరుడ వాహనాలపై దర్శనమిచ్చారు. పెరుమాళ్ల ముందు తిరుమంగై ఆళ్వార్‌, నమ్మాళ్వార్‌, తిరుమళిసై ఆళ్వార్‌ ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పందిరిలో దర్శనం కల్పించారు. గరుడ వాహన సేవగా ఎదురుగా పందిరిలో ఆంజనేయ స్వామి దర్శనమిచ్చారు. వీరిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement