
విద్యార్థులకు అవగాహన
సాక్షి, చైన్నె: అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల కోసం విద్యా కార్యక్రమాలను విస్తృతం చేయనున్నామని ఎస్ఐఎంఏటీఎస్ వీసీ చదరం శివాజీ తెలిపారు. ఎస్ఎస్ఈ అవుట్ కమ్ – బెస్ట్ ఎడ్యుకేషన్(ఏబీఈ) అభ్యాసం ఇంజినీరింగ్ విద్యార్థులకు నిర్మాణాత్మక విధానాల గురించి అవగాహన కల్పించే విధంగా గురువారం కార్యక్రమం స్థానికంగా జరిగింది. విద్యార్థులకు ఇందులో అభ్యాస ఫలితాలు, బోధన వ్యూహాలకు కావాల్సిన సమలేఖనం అంశాలను వివరించారు. ఈ సందర్భంగా వీసీ చదరం శివాజీ మాట్లాడుతూ ఇంజినీరింగ్ రంగంలో ఇన్పుట్ పొందుపరచడం ద్వారా విద్యార్థులకు స్పష్టమైన సమాచారాలు అందించేందుకు వీలుందని వివరించారు. ఇందుకు అనుగుణంగా విద్యా కార్యక్రమాలను విస్తృతం చేస్తామని ఈ సందర్భంగా అన్నారు.