పడవలకు నిప్పు

కాలిపోయిన పడవ - Sakshi

కొరుక్కుపేట: కడలూరు ముదునగర్‌లో 8 పడవలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. దీనిపై పోలీసులు తీవ్ర విచారణ జరుపుతున్నారు. కడలూరులోని ముదునగర్‌, సింగారతోపు, సోనాంకుప్పం మత్స్యకారులకు నిలయంగా ఉంది. ఇక్కడి నుంచి రోజుకు 100కి పైగా పడవల్లో మత్స్యకారులు వేటకు వెళుతుంటారు. ఈ క్రమంలో అక్కడ ఉంచిన పడవలకు మంటలు వ్యాపించాయి. ఆరు బోట్లు పూర్తిగా దగ్ధం అయ్యియి. వలలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో మత్స్యకారులు కడలూరు పోర్టు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. పాత కక్షల కారణంగా పడవలకు నిప్పు పెట్టారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top