పల్లె ఓటర్లు | - | Sakshi
Sakshi News home page

పల్లె ఓటర్లు

Sep 3 2025 5:01 AM | Updated on Sep 3 2025 5:01 AM

పల్లె ఓటర్లు

పల్లె ఓటర్లు

ఐదేళ్లలో పెరిగిన ఓటర్లు 84,329 మంది

లక్షలు
పంచాయతీ తుది ఓటరు జాబితా విడుదల

6.94

భానుపురి (సూర్యాపేట) : పల్లె ఓటర్ల లెక్క తేలింది. జిల్లా వ్యాప్తంగా 486 గ్రామ పంచాయతీల్లో 6.94లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం తుది జాబితా ప్రకటించింది. వీరిలో పురుషులు 3,40,743 మంది, మహిళలు 3,54,050 మంది ఉన్నారు. అత్యధికంగా గరిడేపల్లి మండలంలో 46,796 మంది ఓటర్లు, అత్యల్పంగా తిరుమలగిరి మండలంలో 17,799 మంది ఓటర్లు ఉన్నారు.

486 పంచాయతీలు..

సూర్యాపేట జిల్లావ్యాప్తంగా 475 గ్రామపంచాయతీలు ఉండగా మరో 11 గ్రామపంచాయతీలు కొత్తగా ఏర్పడ్డాయి. 23 ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు, 213 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఈ గతేడాది ఫ్రిబవరిలో గ్రామపంచాయతీల పదవీకాలం, జూలైలో జిల్లా, మండల పరిషత్‌ల పదవీ కాలం ముగిసింది. వీటికి ఎన్నికలు నిర్వహించే క్రమంలో ఒక్కో ప్రక్రియను జిల్లా యంత్రాంగం ఎన్నికల కమిషన్‌ సూచనల మేరకు పూర్తి చేస్తూవస్తోంది. ఇందులో భాగంగా 2024 అక్టోబర్‌ మాసంలోనే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సుముఖత చూపడంతో పంచాయతీ ఓటర్ల తుది జాబితాను అప్పట్లో ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ జాబితా ప్రకారం జిల్లాలో 6,82,882 మంది ఓటర్లు నమోదయ్యారు.

చేర్పులు, మార్పులు..

కొత్తగా జిల్లాలో నమోదైన ఓటర్లు, మార్పులు, చేర్పులతో ఈనెల 28వ తేదీన జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో డ్రాఫ్ట్‌లిస్ట్‌ను ప్రకటించారు. 29న రాజకీయ పార్టీలతో జిల్లా స్థాయిలో, 30వ తేదీన మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో ఆయా రాజకీయ పార్టీల నుంచి వచ్చిన అభ్యంతరాలను స్వీకరించి ఈనెల 31వ తేదీ నాటికి తొలగింపు ప్రక్రియ చేపట్టారు.

13,307 మంది

మహిళా ఓటర్లు అధికం

తుదిజాబితా ప్రకారం జిల్లాలో 6,94,815 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 3,40,743 మంది, మహిళలు 3,54,050 మంది, 22 మంది ఇతరులు ఉన్నారు. అయితే పురుషుల కంటే మహిళా ఓటర్లు 13,307 మంది అధికంగా ఉన్నారు. ఇదిలా ఉండగా 23 మండలాలకు గాను తిరుమలగిరి మండలం మినహా మిగతా 22 మండలాల్లోనూ మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు.

సూర్యాపేట జిల్లాలో పంచాయతీ ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2019 పంచాయతీ ఎన్నికల సమయంలో జిల్లాలో 475 గ్రామ పంచాయతీలు ఉండగా 6,10,486 మంది ఓటర్లు ఉన్నారు. ఇటీవల కొత్తగా 11 గ్రామ పంచాయతీలుగా ఏర్పడగా ప్రస్తుతం ఎన్నికల సంఘం ప్రకటించిన తుది జాబితా ప్రకారం 6,94,815 మంది ఓటర్లు నమోదయ్యారు. ఈ లెక్కన ఐదేళ్లలో 84,329 మంది ఓటర్లు పెరిగారు. దాదాపు ఈ ఓటరు జాబితాతో జిల్లాలో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశముంది.

ఫ గరిడేపల్లి మండలంలో అత్యధికం.. తిరుమలగిరిలో అత్యల్పం

ఫ ఐదేళ్లలో పెరిగిన ఓటర్లు 84,329 మంది

ఫ 22 మండలాల్లోనూ మహిళా ఓటర్లే అధికం

మండలాల వారీగా ఓటర్లు

మండలం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం

అనంతగిరి 12,545 13,343 01 25,889

ఆత్మకూర్‌ 21,800 22,252 01 44,053

చిలుకూరు 15,915 16,984 00 32,899

చింతలపాలెం 13,132 13,700 00 26,832

చివ్వెంల 14,328 14,882 00 29,211

గరిడేపల్లి 22,654 24,135 07 46,796

హుజూర్‌నగర్‌ 10,287 10,744 00 21,031

జాజిరెడ్డిగూడెం 12,157 12,458 00 24,615

కోదాడ 15,462 16,418 00 31,881

మద్దిరాల 12,569 12,738 01 25,307

మఠంపల్లి 18,314 19,349 01 37,663

మేళ్లచెరువు 16,740 17,546 01 34,287

మోతె 18,731 19,087 04 37,823

మునగాల 17,695 18,699 00 36,394

నడిగూడెం 12,089 12,481 01 24,571

నాగారం 12,227 12,545 03 24,775

నేరేడుచర్ల 10,720 11,422 00 22,142

నూతనకల్‌ 14,503 14,563 00 29,066

పాలకవీడు 10,358 11,110 00 21,468

పెన్‌పహాడ్‌ 16,632 17,445 00 34,077

సూర్యాపేట 15,652 15,967 01 31,620

తిరుమలగిరి 8,925 8,874 00 17,799

తుంగతుర్తి 17,308 17,308 00 34,616

మొత్తం 3,40,743 3,54,050 22 6,94,815

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement