
ఒకేసారి.. 3 నెలల బియ్యం
చిలుకూరు: వర్షాకాలం నేపథ్యంలో గతంలో ఎన్నడూలేని విధంగా జూన్, జూలై, ఆగస్టు మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు వచ్చేనెలలో ఒకటవ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఒకేసారి సరఫరా చేయాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది. దీంతో జిల్లాలో పౌరసరఫరాలు, రెవెన్యూ శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతినెలా సరఫరా చేసే ఎంఎల్ఎస్ (మండల్ లెవల్ స్టాక్) పాయింట్ల నుంచి రేషన్ షాపులకు బియ్యం రవాణా ప్రక్రియను ప్రారంభించారు. జిల్లాలోని కోదాడ, హుజూర్నగర్, సూర్యాపేట, తుంగతుర్తి సబ్ డివిజన్ పరిధిలోని ఎంఎల్ఎస్ పాయింట్లు నుంచి బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. అయితే మూడు నెలలకు సంబంధించి ఒకేసారి పంపిణీ చేయనుండడంతో సుమారు 1,78,000 క్వింటాళ్ల బియ్యం అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
విడతల వారీగా సరఫరా..
జిల్లా వ్యాప్తంగా 610 రేషన్ షాపులు ఉండగా వాటి పరిధిలో 3.24లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఆయా షాపుల ద్వారా ప్రతినెలా సుమారు 6.50 లక్షల క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే ఈసారి వచ్చే మూడునెలలకు సంబంధించి ఒకేసారి జూన్లోనే ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా వచ్చేనెలలో మొత్తం 1,78,000 క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. అయితే లబ్ధిదారులు ఒకేసారి మూడు నెలల బియ్యం తీసుకునేందుకు మూడుసార్లు బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న రేషన్ షాపుల్లో గరిష్టగా 300 క్వింటాళ్ల బియ్యం నిల్వ చేసుకునేందుకే సామర్థ్యం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఒకేసారి మూడు నెలల బియ్యం సరఫరా చేస్తే తగిన స్థలం ఉంటుందో లేదో అని వచ్చేనెలలోనే విడతల వారీగా షాపులకు బియ్యం సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయనుండడంతో రవాణా సమస్యలు, అధిక చార్జీలకు చెక్ పడనున్నప్పటికీ వాహనాల కొరత తలెత్తనుందని అధికారులు అంటున్నారు.
అన్ని ఏర్పాట్లు చేశాం
ప్రభుత్వం మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి ఇవ్వాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. సమస్యలను అధిగమించి రేషన్ షాపులకు విడతల వారీగా బియ్యం సరఫరా చేస్తాం. లబ్ధిదారులు కూడా మూడు నెలలకు సంబంధించి మూడుసార్లు వేలిముద్రలు వేసి ఒకేసారి బియ్యం తీసుకోవాలి.
– మోదుగు శ్రీనివాస్రెడ్డి, జిల్లా ఇన్చార్జి డీఎస్ఓ, సూర్యాపేట
ఫ జూన్, జూలై, ఆగస్టు మాసాలకు
సంబంధించి వచ్చేనెలలో పంపిణీ
ఫ వర్షాకాలం నేపథ్యంలో
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం
ఫ ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాంగం
ఫ రేషన్ షాపులకు సరఫరా చేయనున్న 1,78,000 క్వింటాళ్ల బియ్యం
ఫ జిల్లాలో 9,85,061 మంది
రేషన్ లబ్ధిదారులకు ప్రయోజనం
పంపిణీ చేసే బియ్యం వివరాలు
ఎంఎల్ఎస్ పాయింట్ క్వింటాళ్లు
సూర్యాపేట 54,000
కోదాడ 39,000
తుంగుత్తురి 35,000
హుజూర్నగర్ 50,000

ఒకేసారి.. 3 నెలల బియ్యం