
96.81 శాతం ఉత్తీర్ణత
ఫ బాలుర కంటే బాలికలదే పై చేయి
ఫ గురుకుల పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత
ఫ అత్యధికంగా మోడల్స్కూల్ విద్యార్థినికి 586మార్కులు
సూర్యాపేట టౌన్: పదో తరగతి ఫలితాల్లో 96.81 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మెరుగైన ప్రతిభ కనబర్చినప్పటికీ రాష్ట్ర స్థాయిలో జిల్లా ర్యాంకు పడిపోయింది. గత ఏడాది 6వ స్థానంలో నిలువగా ఈ సారి 14వ స్థానానికి పడిపోయింది. బాలురకంటే బాలికలే పై చేయి సాధించారు.
11,508 మంది పాస్
జిల్లాలో మొత్తం 11,887 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా 11,508 మంది పాసై 96.81శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 6,077 మంది పరీక్షలు రాయగా 5,845 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 5,810 మంది పరీక్షలు రాయగా 5,663 మంది ఉత్తీర్ణత సాధించి బాలుర కంటే బాలికలే పై చేయిగా నిలిచారు.
సత్తా చాటిన ప్రభుత్వ విద్యార్థులు..
సూర్యాపేట జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఎయిడెడ్ పాఠశాలల్లో 93.75శాతం ఉత్తీర్ణత సాధించగా ఆశ్రమ పాఠశాలలో 98.65శాతం, బీసీ వెల్ఫేర్ పాఠశాలలో 99.61శాతం, ప్రభుత్వ పాఠశాలల్లో 85.76 శాతం, కేజీబీవీలలో 97.29శాతం, మోడల్ స్కూల్స్లో 97.16శాతం, రెసిడెన్షియల్ పాఠశాలల్లో 100శాతం, సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 98.69 శాతం, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో 96.88 శాతం, జిల్లా పరిషత్ పాఠశాలలో 94.25 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రైవేట్ పాఠశాలల్లో 98.62శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
గత ఏడాది కంటే తగ్గిన జిల్లా ర్యాంకు..
గత ఏడాది 11,910 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 11,542 మంది విద్యార్థులు పాసై 96.91శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో జిల్లా 6వ స్థానంలో నిలిచింది. అయితే ఈ ఏడాది మొత్తం 11,887 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 11,508 మంది విద్యార్థులు పాసై 96.81శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో జిల్లా 14వ స్థానంలో నిలిచింది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినప్పటికీ ర్యాంకు తగ్గింది.
ఎం రితికారెడ్డి(586)
స్నేహిత(580), మద్దిరాల గురుకుల పాఠశాల
జె. ప్రవీణ్(578)
సీహెచ్ ఈశ్వర్(578)
ఇమాంపేట మోడల్ స్కూల్, సూర్యాపేట మండలం
వందశాతం ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ విద్యాసంస్థలు
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 100శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ పాఠశాలలు 85, మోడల్ స్కూల్స్ రెండు, కేజీబీవీ 10, తెలంగాణ రెసిడెన్షియల్ ఒకటి, ఆశ్రమ పాఠశాలలు 12, మైనార్టీ రెసిడెన్షియల్స్ రెండు, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ నాలుగు పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు.