
భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట జిల్లా కేంద్రంలో జూన్ 2న (సోమవారం) జరిగే రాష్ట్ర అవతరణ వేడుకలకు రాష్ట్ర మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని ప్రభుత్వం చీఫ్గెస్ట్గా నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలకు ప్రతినిధులను నియమించింది. కాగా జిల్లాలో జరిగే వేడకల్లో ఉత్తమ్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.
ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయాలి
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసి, ప్రభుత్వ విద్యా వ్యవస్థను రక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఉపాధ్యాయుడిపై ఉందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేటలోని నంబర్–2 ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ, జెడ్పీ ఉన్నత పాఠశాలలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీల ప్రిన్సిపాళ్లకు ఐదు రోజులుగా కొనసాగుతున్న వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని ఆయన సందర్శించారు. అంతకుముందు జిల్లా కేంద్రంలో పీఆర్టీయూ టీఎస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఐకేర్ ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్టోరియల్ అధికారి దేవరశెట్టి జనార్దన్, కందిబండ శ్రవణ్ కుమార్, కోర్సు డైరెక్టర్ అనుములపురి సీనయ్య, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జెల్లా ప్రసాద్, పెనుగొండ శ్రీనివాస్, వనమాల వెంకటేశ్వర్లు, నాగరాణి, దామెర శ్రీనివాస్, ధారాసింగ్, బాలునాయక్, సత్యనారాయణరెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు తంగెళ్ల జితేందర్రెడ్డి, ఎంఈఓలు ధరావత్ ధారాసింగ్, బానోత్ బాలునాయక్, మేకల జాన్రెడ్డి, బొల్లికొండ కోటయ్య, ఐకేర్ ఆసుపత్రి డాక్టర్ ఊట్కూరి శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు.
డీసీసీ ప్రధాన కార్యదర్శిగా గెల్లి రవి
హుజూర్నగర్ : జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) ప్రధాన కార్యదర్శిగా హుజూర్నగర్కు చెందిన గెల్లి రవి నియమితులయ్యారు. శుకవారం ఆయనకు సూర్యాపేటలో మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన మంత్రి, డీసీసీ అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు. రవికి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జునరావు, ఉపాధ్యక్షులు కోడి ఉపేందర్ యాదవ్, పలువురు మాజీ కౌన్సిలర్లు, నియోజకవర్గ, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు అభినందనలు తెలిపారు.
సహకార సంస్థలను అనుసంధానించాలి
నల్లగొండ టౌన్ : సహకార సంస్థలను జాతీయస్థాయిలో అనుసంధానం చేయాలని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో పాడి సహకార సంఘాలను డీసీసీబీలతో అనుసంధానం చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2025–2026ను అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించిన సందర్భంగా జాతీయస్థాయిలో సహకార సంస్థలను అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సహకార సంఘాలను అనుసంధానం చేయడం వల్ల సహకార వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. ప్రాథమిక పాడి సహకార సంఘాలు డీసీసీబీలో సేవింగ్ ఖాతా ఓపెన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఓ పత్యానాయక్, సీఈఓ శంకర్రావు, జీఎం నర్మద, బ్యాంకు డీజీఎంలు, ఏజీఎంలు, పాడి సహకార సంఘాల చైర్మన్లు పాల్గొన్నారు.

రాష్ట్ర అవతరణ వేడుకలకు ముఖ్యఅతిథిగా ఉత్తమ్

రాష్ట్ర అవతరణ వేడుకలకు ముఖ్యఅతిథిగా ఉత్తమ్