అభివృద్ధికి పునరంకితం | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి పునరంకితం

May 31 2025 1:10 AM | Updated on May 31 2025 1:10 AM

అభివృ

అభివృద్ధికి పునరంకితం

ఉమ్మడి జిల్లా సర్వతోముఖాభివృద్ధి రాష్ట్రానికి మార్గదర్శకం కావాలి

కలెక్టర్లదే ముఖ్యపాత్ర

మంత్రి కోమటిరెడ్డి

కేబినెట్‌ నిర్ణయాలను అమలు చేయడంలో కలెక్టర్లదే ముఖ్యపాత్ర అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాను అన్నింటా ముందుంచేలా అధికారులు కృషి చేయాలన్నారు. నల్లగొండ జిల్లాలో ధాన్యం ఉత్పత్తి ఎక్కువగా ఉన్నందున అదనపు గోదాములు మంజూరు చేయడమే కాకుండా, క్లస్టర్లను, ఏఈఓ పోస్టులను మంజూరు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. తన శాఖ ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు అత్యధికంగా 1,700 కోట్ల రూపాయలు కేటాయించామని మంత్రి పేర్కొన్నారు.

పేదల సంక్షేమానికి అధికారులంతా కట్టుబడి పనిచేయాలి

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి

తుమ్మల నాగేశ్వర్‌రావు

సూర్యాపేటలో ఉమ్మడి జిల్లా

సమీక్ష సమావేశం

హాజరైన మంత్రులు ఉత్తమ్‌,

కోమటిరెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యేలు

భానుపురి (సూర్యాపేట) : రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి అధికారులంతా అభివృద్ధికి పునరంకితం కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పిలుపునిచ్చారు. సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భునవగిరి జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయం, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి చట్టంపై శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో మంత్రులు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ అధికారులు నిర్లిప్తత వదిలేసి పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తూ ఉమ్మడి జిల్లాను అన్నింటా అగ్రస్థానంలో నిలపాలన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా సర్వతోముఖాభివృద్ధి.. రాష్ట్రానికి మార్గదర్శకంగా నిలవాలని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాకు ఈ సంవత్సరం లక్ష మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను మంజూరు చేస్తామని, ఇందుకుగాను స్థలాన్ని కేటాయించాలని మూడు జిల్లాల కలెక్టర్లను కోరారు. నల్లగొండ జిల్లాకు అదనంగా ఏఈఓలు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించుకునే అధికారం కలెక్టర్లకు ఇచ్చామని మంతిర పేర్కొన్నారు.

పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌..

సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌.. ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి, వ్యవసాయంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అలాగే నల్లగొండ కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు ఆయా జిల్లాలకు సంబంధించిన వివిధ అంశాలను సమీక్ష సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశంలో సూర్యాపేట ఎస్పీ నరసింహ, రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్‌ పటేల్‌ రమేష్‌రెడ్డి, వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ సభ్యుడు చెవిటి వెంకన్నయాదవ్‌, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొప్పుల వేణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ వంగవీటి రామారావు, ఉమ్మడి జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అభివృద్ధికి పునరంకితం 1
1/2

అభివృద్ధికి పునరంకితం

అభివృద్ధికి పునరంకితం 2
2/2

అభివృద్ధికి పునరంకితం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement