జిల్లా వ్యవసాయాధికారితో నేడు ఫోన్‌ ఇన్‌ | - | Sakshi
Sakshi News home page

జిల్లా వ్యవసాయాధికారితో నేడు ఫోన్‌ ఇన్‌

May 31 2025 1:10 AM | Updated on May 31 2025 1:10 AM

జిల్ల

జిల్లా వ్యవసాయాధికారితో నేడు ఫోన్‌ ఇన్‌

పాలిటెక్నిక్‌ కోర్సుల్లో

ప్రవేశాలకు దరఖాస్తులు

గరిడేపల్లి : తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయ పరిధిలో 2025–26 విద్యాసంవత్సరానికి గాను జిల్లాలోని గడ్డిపల్లిలోని హార్టికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ భగవాన్‌ శుక్రవారం తెలిపారు. శనివారం ఉదయం 10గంటల నుంచి వచ్చేనెల 26 వరకు దరఖాస్తులు సమర్పించాని పేర్కొన్నారు. ఆంగ్లమాద్యమంలో నిర్వహించే ఆయా కోర్సుల్లో 60 శాతం గ్రామీణ, 40శాతం పట్టణ ప్రాంతాల విద్యార్థులకు సీట్లు కేటాయించనున్నట్టు తెలిపారు.

ఈసారి వర్షాలు ముందుగానే కురుస్తున్నందున ఆరుద్ర కార్తె కంటే ముందే

పంటల సాగుకు సన్నద్ధం కావచ్చా.. పత్తి తదితర మెట్టపంటలు ఎప్పుడు వేసుకుంటే బాగుంటుంది. వానాకాలం వరినార్లు పోసుకునేందుకు అనువైన సమయం ఎప్పుడు.. విత్తనాల ఎంపికలో

ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి.. నకిలీ విత్తనాలను ఎలా గుర్తుపట్టాలి.. తదితర సమాచారం రైతులు తెలుసుకునేందుకు జిల్లా వ్యవసాయాధికారితో ‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌ నిర్వహిస్తోంది. రైతన్నలు నేరుగా వ్యవసాయాధికారికి ఫోన్‌ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

తేది. 31.05.2025 (శనివారం) సమయం : ఉదయం

11 నుంచి 12 గంటల వరకు

కోదాడరూరల్‌ : కోదాడ పట్టణ పరిధిలోని హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారి 65పై కట్టకమ్ముగూడెం క్రాస్‌రోడ్డులో ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మించాలని పలు గ్రామాల ప్రజలు శుక్రవారం క్రాస్‌రోడ్డ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ క్రాస్‌రోడ్డు మీదుగా పట్టణ పరిధిలోని ఉత్తమ్‌పద్మావతి నగర్‌, బాబునగర్‌, చిలుకూరు మండలం కట్టకమ్ముగూడెం, రాంచంద్రానగర్‌, కొండాపురం, మునగాల మండలంలోని నర్సింహాపురం గ్రామానికి చెందిన ప్రజలు నిత్యం కోదాడ పట్టణానికి వచ్చిపోతుంటారని తెలిపారు. ఈ క్రమంలో క్రాస్‌రోడ్డు దాటుతూ ఇప్పటికే పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలకు గురై మృతిచెందారన్నారని వాపోయారు. అరగంట పాటు ధర్నా కొనసాగడంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు అక్కడికి చేరుకొని వారితో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. ధర్నాలో ఆయా గ్రామాల నాయకులు రాయబారపు వెంకటేశ్వర్లు, పాయిలి కోటేశ్వరరావు, గిద్దె రాజేష్‌, వీరయ్య, సత్యనారాయణ, సందీప్‌, ఉపేందర్‌, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, బొబ్బయ్య, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

కట్టకమ్ముగూడెం క్రాస్‌ రోడ్డులో ధర్నా చేస్తున్న ప్రజలు

డయల్‌ చేయాల్సిన ఫోన్‌ నంబర్‌ :

89777 55833

జిల్లా వ్యవసాయాధికారితో నేడు ఫోన్‌ ఇన్‌1
1/1

జిల్లా వ్యవసాయాధికారితో నేడు ఫోన్‌ ఇన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement