కోదాడరూరల్ : బైక్పై వెళ్తున్న వ్యక్తిని ట్రాక్టర్ ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన కోదాడ మండల పరిధిలోని గుడిబండ శివారులో గురువారం జరిగింది. కోదాడ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతగిరి మండలం శాంతినగర్కు చెందిన తల్లోజు దుర్గాచారి(29) కోదాడ పట్టణంలోని హిందూజా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. పనిలో భాగంగా గురువారం బైక్పై కోదాడ నుంచి మేళ్లచెర్వు వెళ్తుండగా కోదాడ మండలం గుడిబండ గ్రామ శివారులో కాపుగల్లు క్రాస్రోడ్లో వేగంగా వస్తున్న ట్రాక్టర్ బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దుర్గాచారికి తీవ్రగాయాలు కాగా స్థానికులు 108 వాహనంలో కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి తండ్రి పుల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కారులో నగదు చోరీ
నేరేడుచర్ల: కారులో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు రూ.2.50లక్షలు చోరీ చేశారు. ఈ సంఘటన గురువారం నేరేడుచర్లలో చోటు చేసుకుంది. పట్టణంలోని జాన్పహాడ్ రోడ్డులో గల గంగోత్రి ఆస్పత్రి ఎండీ కనకపూడి మహేష్ తన కారును ఆస్పత్రి ఎదుట నిలిపాడు. బ్యాంకులో నగదు వేసేందుకుగాను కారులో రూ.3లక్షలు ఉన్న బ్యాగును ఉంచి ఆస్పత్రి లోపలికి వెళ్లాడు. తిరిగి మహేష్ వచ్చేసరికి బ్యాగులో రూ.50వేలు మాత్రమే ఉన్నాయి. మిగతా రూ.2.50లక్షలు చోరీకి గురయ్యాయి. దీంతో నేరేడుచర్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.