వేణుగోపాలపురం, చెన్నకేశ్వాపురం గ్రామాల పరిధిలోని బావులు, బోర్లు అడుగంటుతున్నాయి. బావుల్లో చుక్కనీరు లేదు. దీంతో నిమ్మ తోటలకు నీరందకపోవడంతో చెట్లు ఎండిపోతున్నాయి. సాగర్ నీటితో మండలంలోని చెరువులను నింపి నిమ్మ రైతులను ఆదుకోవాలి.
– కిట్టయ్య, నిమ్మ రైతు, వేణుగోపాలపురం,
నడిగూడెం మండలం
నిమ్మ చెట్లు ఎండిపోకుండా
ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి
ప్రస్తుత వేసవిలో నిమ్మ తోటలు ఎండిపోకుండా రైతులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి. ట్యాంకర్ల ద్వారా నీటినందిస్తూ చెట్లను కాపాడుకోవాలి. డ్రిప్ పద్ధతి ద్వారా నీటిని అందించాలి. మల్చింగ్ షీట్లు లేదా వరి పొట్టును కూడా చెట్ల మొదళ్ల వద్ద పోసి ఉంచుకోవాలి. దీంతో నీటితేమ ఆవిరి కాకుండా ఉండి చెట్లు ఎండకుండా ఉంటాయి.
– తీగల నాగయ్య,
జిల్లా ఉద్యానవనశాఖ అధికారి, సూర్యాపేట