
నేడు మంత్రుల రాక
నల్లగొండ : జిల్లా ఇన్చార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డిలు శనివారం నల్లగొండకు రానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మంత్రులు కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్కు చేరుకుంటారు. అక్కడ ఇరిగేషన్, మిషన్ భగీరథ, విద్యుత్ శాఖలపై సమీక్షించనున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, అదనపు కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొననున్నారు.
నూతన ఎస్పీగా నరసింహ
సూర్యాపేటటౌన్: సూర్యాపేట నూతన ఎస్పీగా కె.నరసింహ నియామకమయ్యారు. ఈమేరకు శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న సన్ప్రీత్ సింగ్కు డీఐజీగా ప్రమోషన్ రావడంతో వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా బదిలీ అయ్యారు. మహబూబ్ నగర్ ఎస్పీగా, గవర్నర్ ఏజీసీగా పనిచేసిన నరసింహ కొంతకాలంగా డీజీపీ కార్యాలయంలో వెయిటింగ్లో ఉన్నారు. ఇక్కడి ఎస్పీ బదిలీ కావడంతో సూర్యాపేట జిల్లాకు ఈయన బదిలీపై రానున్నారు.