భానుపురి (సూర్యాపేట) : జిల్లాలోని ఎంపిక చేసిన 23 గ్రామ పంచాయతీల్లో 3,103 ఇళ్ల మార్కింగ్ వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇళ్లపై సంబంధిత మండలాల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మిగిలిన అన్ని గ్రామపంచాయతీలో వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసి నివేదిక సమర్పించాలన్నారు. సూర్యాపేట మండలంలోని 26 మంది మేసీ్త్రలకు ఈ నెల 10న టెక్నాలజీతో ఇంటి నిర్మాణంపై శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. హుజూర్నగర్ లో 20 మంది మేసీ్త్రలకు మాస్టర్ ట్రైనీలతో శిక్షణ ఇప్పించనున్నట్లు చెప్పారు. గ్రామపంచాయతీలో ఉపాధి పనులకు వందమంది కూలీలు వచ్చేలా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసే ఉత్తమ గ్రామపంచాయతీల అవార్డుల కోసం 9 కేటగిరీల్లో ఇప్పటి నుంచే ఆ దిశగా పనులు చేపట్టాలని సూచించారు. అనంతరం ఈజీఎస్ ఇందిరమ్మ ఇళ్లపై ఎంపీడీఓలు, ఎంపీఓ, హౌసింగ్ సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి పదిరోజుల్లో సుమారుగా 30 ఇళ్లను గ్రౌండ్ చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. మండలాల్లో ఎంపిక చేసిన మోడల్ హౌస్ల పనులు 15 రోజుల్లో పూర్తిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో జెడ్పి సీఈఓ, డీఆర్డీఓ అప్పారావు, హౌసింగ్ పీడీ ధర్మారెడ్డి, డీపీఓ నారాయణరెడ్డి, డీఎల్పీఓ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్