ఇంటర్‌ వార్షిక పరీక్షలకు 32 కేంద్రాలు | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ వార్షిక పరీక్షలకు 32 కేంద్రాలు

Mar 4 2025 1:28 AM | Updated on Mar 4 2025 1:28 AM

జిల్లాలో ఈనెల 5వ తేదీ నుంచి 25 వరకు జరిగే ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలకు 32కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. సూర్యాపేటలో 13 పరీక్ష కేంద్రాలు, కోదాడలో 8, నడిగూడెంలో 2, హుజూర్‌నగర్‌లో 2, మఠంపల్లిలో 1, నేరేడుచర్లలో 1, తిరుమలగిరిలో 2, తుంగతుర్తిలో 2, ఆత్మకూరు (ఎస్‌) మండలంలో 1 పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాన్ని ఒక్క రోజు ముందుగానే చూసుకోవాలని, అలాగే రోజూ పరీక్ష కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలని కలెక్టర్‌ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement