చేతులెత్తి మొక్కుతున్న.. పంటలకు నీరివ్వండి | - | Sakshi
Sakshi News home page

చేతులెత్తి మొక్కుతున్న.. పంటలకు నీరివ్వండి

Mar 2 2025 1:20 AM | Updated on Mar 2 2025 1:20 AM

చేతుల

చేతులెత్తి మొక్కుతున్న.. పంటలకు నీరివ్వండి

పెన్‌పహాడ్‌: ప్రభుత్వానికి చేతులెత్తి మొక్కుతున్న.. రైతులకు సాగునీరిచ్చి వరి పంటను కాపాడాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జదీష్‌రెడ్డి అన్నారు. పెన్‌పహాడ్‌ మండలం గాజులమల్కాపురం, చినగారకుంట తండాలో ఎండిన పంట పొ లాలను శనివారం ఆయన పరిశీలించి ఉద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. కృష్ణా, గోదావరి ఆయకట్టులో పొలాలు ఎండిపోవడం కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన పాపమేనని అన్నారు. గోదావరిలో 10వేల క్యూసెక్కుల నీటి లభ్యత ఉన్నా ఇసుక వ్యాపారం కోసం రైతుల పంట పొలాలను ఎండబెడుతున్నారని ఆరోపించారు. ఒక్క కన్నెపల్లి పంప్‌ హౌస్‌ బటన్‌ ఆన్‌ చేస్తే పంటలన్నీ పండుతాయన్నారు. కాళేశ్వరం మా చేతికి ఇస్తే కేవలం మూడు రోజుల్లో చివరి ఆయకట్టు వరకు నీళ్లు పారిస్తామని సవాల్‌ విసిరారు. ఎక్కడ కేసీఆర్‌కి పేరొస్తుందోనని రైతుల ఉసురు తీస్తున్నారన్నారు. ఇప్పటికై నా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కళ్లు తెరిచి నీటిని అందించి ఉన్న పంటలనైనా కాపాడాలని డిమాండ్‌ చేశారు. పంటలు ఎండి గత్యంతరం లేక గొర్లు, పశువులకు మేతకు అమ్ముంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరి ఆశగా వరి పంటకు ట్యాంకర్‌ ద్వారా నీళ్లు అందిస్తున్నామని, మీరే ఏమైనా చేసి తమను గట్టెక్కించాలని పలువురు రైతులు జగదీష్‌రెడ్డిని వేడుకున్నారు. జగదీష్‌రెడ్డి వెంట పెన్‌పహాడ్‌ మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం, బీఆర్‌ఎస్‌ నాయకులు దొంగరి యుగేంధర్‌, వెన్న సీతారాంరెడ్డి, నాతాల జానకిరాంరెడ్డి, జూలకంటి వెంకట్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

ఫ రైతుల కష్టాలకు చలించి కంటతడి పెట్టుకున్న మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి

చేతులెత్తి మొక్కుతున్న.. పంటలకు నీరివ్వండి1
1/1

చేతులెత్తి మొక్కుతున్న.. పంటలకు నీరివ్వండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement