సాగునీరు అందించాలని నూతనకల్‌ రైతుల ధర్నా | - | Sakshi
Sakshi News home page

సాగునీరు అందించాలని నూతనకల్‌ రైతుల ధర్నా

Mar 1 2025 7:41 AM | Updated on Mar 1 2025 7:38 AM

భానుపురి (సూర్యాపేట): ఎస్సారెస్పీ రెండో దశ ద్వారా సాగునీరు అందించి పంటలను కాపాడాలని డిమాండ్‌ చేస్తూ నూతనకల్‌ మండలానికి చెందిన రైతులు సూర్యాపేట ఇరిగేషన్‌ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రెండు పంటలకు సాగునీరు అందిస్తామని మాయమాటలు చెప్పారని, ప్రస్తుతం పంటలు ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన రైతులు తీగల మల్లారెడ్డి, పన్నాల మల్లారెడ్డి, జక్కుల మల్లయ్య, అనిల్‌రెడ్డి, మల్లారెడ్డి, మధుసూదన్‌, రవీందర్‌రెడ్డి, రవి, సురేందర్‌, ఆకుల సత్తయ్య, ఉపేందర్‌రెడ్డి, బయ్య ముత్యాలి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement