100 రామచిలుకలు పట్టివేత
ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్ (ఆమదాలవలస) రైల్వేస్టేషన్లో శుక్రవారం 100 రామచిలుకలను తీసుకెళ్తున్న ఇద్దరిని ఆర్పీఎఫ్ పోలీసులు అడ్డుకున్నారు. వీటిని తరలిస్తున్నారనే విషయమై ప్రశ్నిస్తుండగా పక్షులను వదిలి ఇద్దరూ పారిపోయినట్లు సిబ్బంది చెబుతున్నారు. ఉన్నతాధికారులకు నివేదించి తదుపరి చర్యలు చేపడతామని వారు తెలిపారు. కాగా, శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్(ఆమదాలవలస) ఆర్పీఎఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో వివిధ రకాలకు చెందిన 400 కేసులను శుక్రవారం పరిష్కరించినట్లు ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ ఎస్.కాంతారావు తెలిపారు. రైల్వేజడ్జి జి.కార్తి ఈ కేసులు పరిష్కరించినట్లు చెప్పారు.


