వివాహిత ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Jun 3 2023 1:22 AM | Updated on Jun 3 2023 1:22 AM

పోలా భాను మృతదేహం  - Sakshi

పోలా భాను మృతదేహం

కాశీబుగ్గ: పలాస –కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్‌లో వివాహిత పోలా భాను(28) ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుంది. మృతురాలి భర్త స్థానికంగా పెయింటింగ్‌ పనులు చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని, శుక్రవారం ఉదయం సైతం గొడవ పడ్డారని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ నాగిరెడ్డి, సీఐ శ్రీనివాస్‌ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement