
దిక్కు లేకుండా పోయింది
మా ఊరి పంచాయతీ స్థలంలో చాలా ఏళ్ల క్రితం పశువుల కోసం తాగునీటి తొట్టె నిర్మించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ తొట్టెను తొలగించి.. పక్కనే నివాసం ఉంటున్న నరసింహులు ఆక్రమించి తన స్వప్రయోజనాలకు వినియోగించేందుకు రూమ్ నిర్మించాడు. మొదట్లోనే ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశాం. ఎంపీడీఓ వచ్చి బాత్రూమ్ కట్టడాలను అడ్డుకుని తిరిగి తాగునీటి తొట్టె నిర్మిస్తామని చెప్పారు. అయితే ఆ తర్వాత గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. టీడీపీ బడానేతల అండతో అధికారులను గ్రామంలోకి రానీవ్వకుండా చేసి నిర్మాణం పూర్తి చేశాడు. ప్రస్తుతం ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు కూడా ఇబ్బందిగా ఉంది.
– బయపురెడ్డి, గుంతపల్లి, కనగానపల్లి మండలం