
నాటుసారా రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం
● ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ నాగముద్దయ్య
పుట్టపర్తి టౌన్: నాటుసారా రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ అధికారులను ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ నాగముద్దయ్య ఆదేశించారు. అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖరరెడ్డి, సూపరింటెండెంట్ నరసింహులుతో కలసి జిల్లా ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయంలో శుక్రవారం అధికారులతో ఆయన సమీక్షించారు. నాటుసారా, నవోదయం, అక్రమ మద్యం రవాణాపై రివ్యూ చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పర్యటించి నాటుసారా తయారీదారులు, అమ్మకందారులను గుర్తించి కేసులు నమోదు చేయాలన్నారు. పాత నేరస్తులు, అనుమానిత వ్యక్తులను గుర్తించి బైండోవర్ చేయాలన్నారు. శిస్తు కట్టని మద్యం అమ్మకందారులపై చర్యలు తీసుకోవాలన్నారు. కల్లు కల్తీ కాకుండా నిరంతర తనిఖీలు చేపట్టాలన్నారు. ఎమ్మార్పీకే మద్యం విక్రయాలు జరిగేలా చొరవ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారి గోవింద్నాయక్, శ్రీరామ్తో పాటు ఎక్పైజ్ సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.