తొలి రోజు 65 శాతం అభ్యర్థుల హాజరు
అనంతపురం అర్బన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 9వ తేదీ నాటికి పరీక్షలు ముగుస్తాయి. తొలి రోజున అభ్యర్థుల హాజరు 65 శాతం నమోదయ్యింది. అనంతపురంలోని పీవీకేకే ఇంజినీరింగ్ కళాశాల, శ్రీ బాలజీ పీజీ కళాశాల కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 594 మంది అభ్యర్థులకు గాను 389 మంది హాజరయ్యారు. 205 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు.
పరీక్ష కేంద్రాలను కలెక్టర్ వి.వినోద్కుమార్ సందర్శించి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. కేంద్రాల్లో ఏర్పాట్లు, మౌలిక సదుపాయల కల్పనపై ఆరా తీశారు. వేసవి దృష్ట్యా తాగునీటి సదుపాయంతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఏపీఎస్సీ నియమ, నిబంధనలు కచ్చితంగా అమలు కావాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, లైజన్ అధికారి ఎస్డీసీ తిప్పేనాయక్, తహసీల్దార్ హరికుమార్ ఉన్నారు.
ఎదురెదురుగా ఢీకొన్న రెండు కార్లు
డిప్యూటీ తహసీల్దార్ ఇంతియాజ్కు గాయాలు
కనగానపల్లి: మండల పరిధిలోని మామిళ్లపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డిప్యూటీ తహసీల్దార్ ఇంతియాజ్ గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పెనుకొండ రెవెన్యూ డివిజన్లో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ ఇంతియాజ్, సీనియర్ అసిస్టెంట్ అన్షర్బాషాతో కలిసి శనివారం ఉదయం అనంతపురం నుంచి పెనుగొండ వైపు వెళ్తున్నారు. ఇదే సమయంలో బెంగళూరు నుంచి అనంతపురం వైపు వస్తున్న మరో కారు రహదారి మధ్యలో ఉన్న డివైడర్ను ఢీకొని ఇటువైపు వెళ్తున్న వీరి కారును ఎదురుగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీటీ ఇంతియాజ్తో పాటు సీనియర్ అసిస్టెంట్ అన్షర్బాషా గాయపడ్డారు. స్పందించిన స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కనగానపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.
కురుబ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
పుట్టపర్తి అర్బన్: జిల్లాలోని కురుబ కులానికి చెందిన పది, ఇంటర్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్లు కురుబ ఉపాధ్యాయ ఉద్యోగులు సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల విద్యార్థులు ఈనెల 8వ తేదీ లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. పదో తరగతిలో 500 మార్కులు ఆపైన వచ్చిన విద్యార్థులు, ఇంటర్లో 900 మార్కులు ఆపైన వచ్చిన విద్యార్థులు అర్హులన్నారు. 8985997169, 9505551006, 6281140300, 9705684227 నంబర్లకు ఫోన్ చేసి వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు.
మార్మోగిన నారసింహ నామస్మరణ
కదిరి టౌన్: పట్టణంలోని ఖాద్రీ ఆలయం శనివారం నారసింహ నామస్మరణతో మార్మోగింది. భక్తులు పెద్దసంఖ్యలో స్వామిని దర్శించుకున్నారు. స్వామి కాపులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం వేళ మహిళలు ఆలయం ముందు దీపాలు వెలిగించారు. ఆలయ అధికారులు భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అన్నదానం ఏర్పాటు చేశారు.

గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం