
చీనీ తోటల్లో డ్రోన్ సర్వేతో అధ్యయనం
గార్లదిన్నె: చీనీ తోటల్లో పురుగులు, తెగుళ్లు, యాజమాన్య పద్ధతలపై సాంకేతికంగా డ్రోన్ సర్వేతో అధ్యయనం చేసి రైతులకు సలహాలు, సూచనలు అందించవచ్చునని జిల్లా ఉద్యాన అధికారి ఫిరోజ్ఖాన్ అన్నారు. గురువారం గార్లదిన్నె మండబలం ముకుందాపురంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో డ్రోన్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ని రైతులకు చేరువ చేయాలని ఉద్దేశ్యంతో రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్ట్గా ముకుందాపురం గ్రామాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా 17 బృందాలు ముకుందాపురంలోని చీనీ తోటలను సందర్శించి జీపీఎస్ ట్రాకింగ్ చేసి ప్రభుత్వానికి పంపిస్తాయన్నారు. అలాగే కంపెనీ సాంకేతిక సహకారంతో డ్రోన్లో ఏర్పాటు చేసిన మల్టీ స్పెషల్ ఐదు కెమెరాల ద్వారా చీడపీడలపై చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులపై సలహాలు, సూచనలు అందిస్తారన్నారు. మూడు రోజులుగా డ్రోన్ల ద్వారా 500 హెక్టార్ల విస్తీర్ణంలో అధ్యయనం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉద్యాన అధికారి రత్నకుమార్, విస్తరణాధికారి రామాంజనేయులు, రైతులు పాల్గొన్నారు.