
కరెంటు బిల్లు కట్టడం ఇక ఈజీ
● బిల్లులోనే క్యూఆర్ కోడ్
● స్కాన్ చేసి పేమెంట్ చేసే అవకాశం
● ఉమ్మడి ‘అనంత’లో ఈ నెల నుంచి ప్రయోగాత్మకంగా అమలు
అనంతపురం టౌన్: విద్యుత్ బిల్లులు చెల్లింపుల్లో వినియోగదారులు ఇబ్బందులు పడకుండా ఏపీ ఎస్పీడీసీఎల్ చర్యలు తీసుకుంది. గతంలో ఫోన్పే, గూగుల్పే తదితర యాప్లతో విద్యుత్ బిల్లులు చెల్లించేవారు. అయితే కొత్తగా విద్యుత్ బిల్లులు మొత్తం నేరుగా డిస్కంలకు వెళ్లే విధంగా బిల్డెస్కు విధానాన్ని సంస్థ ప్రవేశపెట్టింది. ఈ విధానంలో విద్యుత్ వినియోగదారులు బిల్లులు చెల్లించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆన్లైన్లో బిల్లులు చెల్లించలేక గంటల తరబడి క్యూలో వేచి ఉండి బిల్లులు చెల్లిస్తున్నారు. దీంతో ఎస్పీడీసీఎల్ సంస్థ మే నెలలో నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. విద్యుత్ బిల్లులోనే చెల్లించాల్సిన మొత్తానికి క్యూఆర్ కోడ్ను జత చేసింది. దీంతో వినియోగదారులు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం యాప్ల ద్వారా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి విద్యుత్ బిల్లులను డిజిటల్ పేమెంట్ ద్వారా చెల్లించవచ్చు. ఈనెలలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా క్యూఆర్ కోడ్ విద్యుత్ బిల్లులను ప్రయోగాత్మకంగా వినియోగదారులకు అందిస్తున్నారు.
గిరిజన బాలికల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
గోరంట్ల: స్థానిక గిరిజన బాలికల పాఠశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ విజయకుమార్ తెలిపారు. మూడో తరగతిలో 40 సీట్లు, నాల్గో తరగతిలో 32, 5వ తరగతిలో 31, 6వ తరగతిలో 21, 7వ తరగతిలో 1, 8వ తరగతిలో 2, 9వ తరగతిలో రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హులైన గిరిజన బాలికలు ఈనెల 2వ తేదీ నుంచి 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం 8897820565 నంబర్లో సంప్రదించవచ్చన్నారు.
చౌళూరు మధుమతిరెడ్డికి కీలక పదవి
● వైఎస్సార్సీపీ మహిళా విభాగం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియామకం
సాక్షి, పుట్టపర్తి: వైఎస్సార్ సీపీ నాయకురాలు చౌళూరు మధుమతిరెడ్డికి కీలక పదవి దక్కింది. ఆ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా ఆమెను నియమిస్తూ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ సందర్భంగా మధుమతిరెడ్డి మాట్లాడుతూ.. తన సేవలను గుర్తించి పార్టీలో సముచితస్థానం కల్పించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
జాతీయ స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపిక
పరిగి: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థిని హర్షవల్లి జాతీయ స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికై ంది. ఇటీవల హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తెనాలిలో ఏప్రిల్ 25, 26 తేదీల్లో రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలు నిర్వహించారు. ఇందులో పరిగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన హర్షవల్లితో పాటూ, 7, 8, 9వ తరగతి చదువుతున్న గంగమ్మ, వర్షిత, ప్రవల్లిక, భవ్య, రమ్య, సౌమ్య ఉమ్మడి అనంతపురం జిల్లా జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన హర్షవల్లి జాతీయ స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు కృపా సత్యరాజు తెలిపారు. కర్ణాటక రాష్ట్రం మైసూరులోని శ్రీరంగపట్నంలో జరగనున్న 39వ సబ్ జూనియర్స్ జాతీయ స్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున హర్ణవల్లి ప్రాతినిథ్యం వహిస్తుందని వెల్లడించారు.

కరెంటు బిల్లు కట్టడం ఇక ఈజీ

కరెంటు బిల్లు కట్టడం ఇక ఈజీ