పుట్టపర్తి: రీకౌంటింగ్ కోరే ‘డైట్’ విద్యార్థులు ఈ నెల 7వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని బుక్కపట్నం డైట్ కళాశాల ప్రిన్సిపాల్ సూచించారు. గత నెలలో నిర్వహించిన సప్లిమెంటరీ ఫలితాలు వెలువడ్డాయని, రీకౌంటింగ్కు కోరుకునే విద్యార్థులు 7వ తేదీలోపు రూ.500 చలానా చెల్లించాల్సి ఉంటుందన్నారు. అనంతరం చలానాతో పాటు సంబంధిత అన్ని సర్టిఫికెట్లను విజయవాడకు పంపాల్సి ఉంటుందన్నారు. పూర్తి వివరాల కోసం డైట్ కళాశాలలో సంప్రదించాలని సూచించారు.
8న ‘క్రీడా భారతి’ ఆన్లైన్ పరీక్ష
పుట్టపర్తి టౌన్: చైతన్య కష్యప్ ఫౌండేషన్ అందించే ‘క్రీడా భారతి’ అవార్డుల కోసం నిర్వహించే ఆన్లైన్ జ్ఞాన పరీక్ష ఈనెల 8వ తేదీన ఉంటుందని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఉదయభాస్కర్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటనలో విడుదల చేశారు. 12 ఏళ్లు పైబడిన వారందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. మొత్తం 50 ప్రశ్నలు ఉంటాయని, ఇందుకు సమయం 25 నిమిషాలు ఉంటుందన్నారు. కంప్యూటర్, లాప్టాప్, ట్యాబ్, మైబెల్ ద్వారా ఆన్లైన్లో పరీక్ష రాయవచ్చని సూచించారు. పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి మొదటి బహుమతిగా ఒకరికి రూ.లక్ష, రెండో బహుమతిగా రూ.50 వేలు (ఇద్దరికి) , మూడో బహుమతిగా రూ.25 వేలు (ఆరుగురికి), నాల్గో బహుమతిగా రూ.11 వేలు (11 మందికి) ఇస్తారన్నారు. పూర్తి వివరాలకు http://kreedaabharati. org వెబ్సైట్ను చూడాలన్నారు.
వాహన్ పోర్టల్లోనే అన్ని సేవలు
హిందూపురం: ఇప్పటి వరకూ రవాణా సేవలు అందిస్తున్న ఈ–ప్రగతి https:// aprtacitizen. epragathi. org/#!/ index పోర్టల్ను డిసెంబర్ సాయంత్రం 6 గంటల నుండి నిలిపి వేస్తున్నామని, ఇక నుంచి రవాణా సేవలన్నీ ‘వాహన్’ పోర్టల్లోనే చేసుకోవాల్సి ఉంటుందని జిల్లా రవాణాశాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని వాహనాల సేవల కోసం ( ూఐఇగఅఏఅూ) పోర్టల్ను ఉపయోగించాలని సూచించారు. ( https:// vahan. parivahan. gov. in/ vahanservice/ vahan/ ui/ statevalidation/ homepage. xhtml) లింక్ ద్వారా కొత్త పోర్టల్లో సేవలు పొందవచ్చన్నారు.