నెట్టికంటుడి హుండీ ఆదాయం రూ.43.10 లక్షలు | - | Sakshi
Sakshi News home page

నెట్టికంటుడి హుండీ ఆదాయం రూ.43.10 లక్షలు

Mar 29 2023 12:48 AM | Updated on Mar 29 2023 12:48 AM

హుండీ నగదును లెక్కిస్తున్న దృశ్యం   - Sakshi

హుండీ నగదును లెక్కిస్తున్న దృశ్యం

గుంతకల్లు రూరల్‌: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానానికి హుండీ కానుకల ద్వారా రూ.43.10 లక్షల ఆదాయం లభించినట్లు ఈఓ వెంకటేశ్వరెడ్డి తెలిపారు. భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకల లెక్కింపు మంగళవారం ఆలయంలో చేపట్టారు. 49 రోజులకు గానూ రూ.43,10,744 నగదు, అదేవిధంగా అన్నదాన హుండీ ద్వారా రూ.52,260 నగదును భక్తులు సమర్పించినట్లు తెలిపారు. 0.004 గ్రాముల బంగారు, 1.309 కిలోల వెండిని కానుకల రూపంలో స్వామికి సమర్పించినట్లు పేర్కొన్నారు. పాలకమండలి చైర్‌పర్సన్‌ సుగుణమ్మ, ఆలయ అధికారులు తదితరులు హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement