ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొంటున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, సైలెన్లు సిద్ధంగా ఉంచాం. అలాగే ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల వద్ద కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచాం. ఉపాధి హామీ కూలీల కోసం ఆ శాఖకు సరిపడిన ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాం. ఎండ వేడిమికి నీరసంగా ఉంటే ఓఆర్ఎస్ ప్యాకెట్లు నీటిలో కలుపుకుని తాగాలి. ఈ విషయమై ప్రజలను అప్రమత్తం చేయాలని అన్ని పీహెచ్సీల డాక్టర్లకు సూచించాం. వేసవి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నీరసం, తలనొప్పి లాంటి లక్షణాలుంటే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలి.
– డాక్టర్ సుజాత, డీఎంహెచ్ఓ


