లారీ ఢీకొని యువకుడి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని యువకుడి దుర్మరణం

Aug 9 2025 8:03 AM | Updated on Aug 9 2025 8:03 AM

లారీ ఢీకొని యువకుడి దుర్మరణం

లారీ ఢీకొని యువకుడి దుర్మరణం

మరో వ్యక్తికి గాయాలు

మర్రిపాడు: మండల కేంద్రమైన మర్రిపాడు హెచ్‌పీ పెట్రోల్‌ బంకు సమీపంలో శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. ఆత్మకూరు మండలం రామస్వామిపల్లి నుంచి మోటార్‌బైక్‌పై మహమ్మద్‌ (20), ఆకాష్‌ బద్వేల్‌కు బయలుదేరారు. మర్రిపాడులోని నెల్లూరు – ముంబై జాతీయ రహదారి సమీపంలో హెచ్‌పీ పెట్రోల్‌ బంకు సమీపంలో గుర్తుతెలియని లారీ బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో మహమ్మద్‌ మృతిచెందగా ఆకాష్‌ గాయపడ్డాడు. సమాచారం అందుకున్న మర్రిపాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ ఆగకుండా వెళ్లిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement