
వైభవంగా కల్యాణం
రాపూరు: పెంచలకోన క్షేత్రంలో శనివారం సాయంత్రం శ్రీపెనుశిలలక్ష్మీనరసింహాస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవిలకు శాస్త్రోక్తంగా ఊంజల్ సేవ నిర్వహించారు. ఉత్సవ మూర్తులను అలంకార మండపంలోకి వేంచేపు చేసి అక్కడ తిర్చుపై కొలువుదీర్చారు. ఆభరణాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం సహస్రదీపాలంకరణ మండపంలో ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు.ఉదయం నిత్య కల్యాణ మండలపంలో స్వామి అమ్మవార్ల కల్యాణం ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి పునీతులయ్యారు.

వైభవంగా కల్యాణం