
నెల్లూరు(క్రైమ్): అనుమానం పెనుభూతంలా మారి పచ్చని సంసారంలో చిచ్చు రాజేసింది. భార్యపై మచ్చుకత్తితో భర్త దాడి చేసిన ఘటన నెల్లూరు రామ్మూర్తినగర్లో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు రూరల్ మండలం సిద్ధివరపుపాడుకు చెందిన రమకు కావలికి చెందిన బి.శ్రీనాథ్తో 2017లో వివాహమైంది. శ్రామికనగర్లో కాపురం పెట్టారు. వారికి ఇద్దరు సంతానం. శ్రీనాఽథ్ ఆటో నడుపుతుంటాడు. మద్యానికి బానిసైన అతను సంపాదించిన మొత్తాన్ని తన అవసరాలకు వాడుకోసాగాడు.
భార్యపై అనుమానం పెంచుకుని తరచూ కొట్టడం, పెద్దలు సర్దిచెప్పడం జరుగుతోంది. రెండునెలలుగా రమ భర్త, పిల్లలతో కలిసి పొదలకూరురోడ్డులోని తల్లిదండ్రుల ఇంట్లో ఉంటోంది. ఆమె రామ్మూర్తినగర్లోని హెచ్ఆర్ పర్మినెంట్ మేకప్ సెలూన్లో బ్యూటీషియన్గా పనిచేస్తోంది. రోజులానే ఆదివారం స్కూటీపై సెలూన్కు వెళ్లింది. పక్కనే ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ షోరూం వద్ద వాహనాన్ని పార్క్ చేసి బ్యాగ్ తీసుకుంటుండగా శ్రీనాథ్ ఒక్కసారిగా మచ్చుకత్తితో ఆమె తలపై, కుడి భుజం, ఎడమచేయి మణికట్టు మీద నరికి పరారయ్యాడు.
తీవ్రరక్తస్రావం కావడంతో ఆమె అక్కడే కుప్పకూలింది. సెలూన్ మేనేజర్ సమీర్, సోనోవిజన్లో పనిచేస్తున్న అమూల్య మరికొందరు రమను చికిత్స నిమిత్తం జయభారత్ హాస్పిటల్లో చేర్పించారు. సమాచారం అందుకున్న బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ కె.సాంబశివరావు హాస్పిటల్కు చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. ఆమె ఫిర్యాదు మేరకు శ్రీనాథ్పై హత్యాయత్నం, వేధింపుల కేసు నమోదు చేశారు.

భార్యపై భర్త హత్యాయత్నం