
కారుణ్య నియామకాల ఉత్తర్వుల అందజేత
నెల్లూరు(అర్బన్): ఇద్దరు ఉద్యోగులు మృతిచెందగా రెండు కుటుంబాలకు చెందిన ఇద్దరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పిస్తూ ఇన్చార్జి కలెక్టర్ కార్తీక్ ఉత్తర్వులిచ్చారు. స్పెషల్ సర్వేయర్ పి.శేషయ్య చనిపోగా ఆయన కుమార్తె యశస్వినికి రెవెన్యూ విభాగంలో జూనియర్ అసిస్టెంట్గా అవకాశం కల్పించారు. పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తూ ఎ.మహేష్ మృతిచెందగా ఆయన భార్య విజయను సంక్షేమ శాఖలో వాచ్ఉమెన్గా నియమించారు. అపాయింట్మెంట్ లెటర్లను డీఆర్వో ఉదయభాస్కర్రావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి విజయకుమార్లు శుక్రవారం కలెక్టరేట్లో వారికి అందజేశారు.