సచివాలయం ఎత్తేశారు | - | Sakshi
Sakshi News home page

సచివాలయం ఎత్తేశారు

May 29 2025 12:38 AM | Updated on May 29 2025 12:38 AM

సచివా

సచివాలయం ఎత్తేశారు

గ్రామ, సచివాలయాలు 535

నాడు ప్రతీ ఊరూ రాజధాని

స్థాయిలో అభివృద్ధి

నేడు సేవలు శూన్యం.. పథకాలు మాయం

గోడౌన్లగా మారిన సచివాలయాలు, ఆర్బీకే భవనాలు

అడపాదడపా తెరుచుకుంటున్న

విలేజ్‌ క్లినిక్‌లు

అసలే తెరుచుకోని వైఎస్సార్‌ డిజిటల్‌ లైబ్రరీలు, డెయిరీ భవనాలు

కొన్ని అలంకార ప్రాయం.. మరికొన్ని నిరుపయోగం

మూత పడిన రైతు సేవా కేంద్రం

తలుపులు తెరుచుకోని హెల్త్‌ క్లినిక్‌

సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ఏడు దశాబ్దాల పైబడిన స్వతంత్ర భారతావనిలో మహాత్మా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం.. కలగానే మిగిలిపోయింది. ఆయన 150వ జయంతి ప్రత్యేకతగా 2019 అక్టోబరు 2న స్వరాజ్య పాలనకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ప్రతి మారుమూల పల్లెను రాజధాని స్థాయిలో అభివృద్ధి చేసేందుకు బీజాలు వేయడమే కాకుండా.. ఆగమేఘాల మీద ఆవిష్కృతం చేశారు. గడిచిన ఐదేళ్లు ప్రగతికి ప్రతిరూపంగా విలసిల్లిన పల్లెలు, పట్టణాలు, నగరాలు.. ఇప్పుడు గొల్లుమంటున్నాయి.

ఊరు.. వార్డు దాటకుండానే..

ప్రజలు నిత్య జీవనంలో అవసరమైన సేవలు, సంక్షేమ ఫలాలు పొందేందుకు ఊరు, వార్డునే కాదు.. కనీసం ఇల్లు కూడా దాటకుండానే.. ఒక్క మాటలో చెప్పాలంటే.. కాళ్లు తడవకుండా సప్త సముద్రాలను దాటినట్లుగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్ర జలకు అందుబాటులోకి తెచ్చారు. సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయకుండానే ప్రతి గడపకు చేర్చారు. దాదాపు 14 వేల మంది వలంటీర్లను నియమించి 534 రకాల పౌర సేవలను అందుబాటులోకి తెచ్చారు.

కలయా నిజమా..

2019 వరకు గ్రామీణ ప్రజలు ఏ అవసరం వచ్చినా.. పట్టణాలు, డివిజన్‌, జిల్లా కేంద్రాలకు పరుగులు పెట్టాల్సిన పరిస్థితులు ఉండేవి. ప్రభుత్వాల ఆదరణ లేక వ్యవసాయం, ఉపాధి పనులు లేక ఊర్లు విడిచి వలస వెళ్లిన పల్లె జనం తిరిగి సొంతూర్ల బాట పట్టారు. చదువుల కోసమో.. ఉపాధి కోసమో ఊర్లకు దూరంగా ఉంటున్న వారు తిరిగొచ్చాక మారిన తమ ఊరు రూపురేఖలు చూసి ఔరా.. ఇది కలయా.. నిజమా.. అంటూ కొన్ని క్షణాలు ఉద్విగ్న స్థితిలోకి వెళ్లారు. ప్రతి పంచాయతీ, వార్డు పరిధిలో 2 వేల మంది జనాభాకు ఒక సేవాలయాలుగా జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్‌లు, విలేజ్‌ లైబ్రరీలు, మిల్క్‌ చిల్లింగ్‌ సెంటర్ల నిర్మించారు.

ఠంచన్‌గా తలుపు తట్టిన పింఛన్‌

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ప్రతి నెల 1వ తేదీ వేకువ జామునే తలుపు తట్టి పింఛన్‌ ఇచ్చి కొత్త చరిత్రను లిఖించారు. అంతకు ముందు వరకు టీడీపీ పాలనలో ప్రతి నెలా పింఛన్‌ అందుకోవాలంటే.. పది రోజులు పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఉండేది. ఆ కష్టాలకు చెక్‌ పెడుతూ వలంటీర్ల వ్యవస్థను నిర్మించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశ స్థాయిలో సరికొత్త అధ్యయానికి శ్రీకారం చుట్టారు. అప్పటి ప్రభుత్వంలో అర్హత సాధించే ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందించేందుకు ప్రణాళికను రూపొందించారు. ప్రతి ఆర్నెళ్లకు ఒక్కసారి లబ్ధిదారుల ఎంపిక చేపట్టి ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 3,14,422 సామాజిక పింఛన్లు ఉంటే.. ఇప్పుడు కూటమి పాలనలో 3,05,804 మందికే ఇస్తున్నారు. కొంత పింఛన్ల ఎంపికను గాలికి వదిలేశారు.

అప్పుడు 534 సేవలు

గతంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వలంటీర్లతోపాటు 11 రకాల కేడర్‌ ఉద్యోగుల ద్వారా 534 సేవలను అందించారు. దాదాపు 36 పథకాలను అందించారు. ఇప్పుడు కూటమి పాలనలో సేవలు, సంక్షేమ ఫలాలు నిర్వీర్యమయ్యాయి. ఏడాది కాలం పూర్తవుతున్నా సంక్షేమ పథకాల అమలు చేయడం లేదు. ఎన్నికల సమయంలో సంపద సృష్టించి సంక్షేమ ఫలాలు అందిస్తానని చంద్రబాబు అబద్ధాలు చెప్పాడు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా పావులు కదుపుతుంది.

ఇంటి వద్దకే వైద్యం.. ఇప్పుడు?

దేశంలో ఏరాష్ట్రంలో లేని విధంగా వైద్య ఆరోగ్య రంగానికి సీఎం వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి అత్యధిక ప్రాధా న్యత ఇచ్చారు. రూ.వేల కోట్లు వ్యయం చేశారు. పల్లె ముంగిటకే వైద్యులు వచ్చేలా ఇంటికి వెళ్లే వైద్య సేవలు అందించే బృహత్తర కార్యక్రమం ప్రవేశ పెట్టారు. ఇందుకోసం ప్రతి 2,550 జనాభాకు ఒక డాక్టర్‌ వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ను ఏర్పాటు చేసింది. బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు అర్హత కలిగిన మిడ్‌లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌ (ఎంహెచ్‌పీ)లను నియమించారు. జిల్లాలో మొత్తం 61 ప్రాథమిక ఆరోగ్య కేంద్రా (పీహెచ్‌సీ)లకు అనుబంధంగా 497 డాక్టర్‌ వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు నిర్మించారు. అందులో 12 రకాల వైద్య సేవలు, 14 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. 67 రకాల బేసిక్‌ ఎక్విప్‌మెంట్‌ను అందుబాటులో ఉంచారు. విలేజ్‌ క్లినిక్‌లన్నింటిలో ఏఎన్‌ఎంలతోపాటు హెల్త్‌ అసిస్టెంట్‌తో పాటు ఆశా కార్యకర్తలు 24 గంటలు అందుబాటులో ఉంటున్నారు. విలేజ్‌ క్లినిక్‌లను పీహెచ్‌సీలు, ల్యాబ్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అనుసంధానం చేశారు. దీంతో టెలీమెడిసిన్‌ వైద్య సదుపాయం కల్పించారు.

ఏడాదిగా పల్లె కన్నీరు

వైఎస్సార్‌

డిజిటల్‌ లైబ్రరీలు

272

వార్డు

సచివాలయాలు

234

ఆర్బీకేలు

656

విలేజ్‌

క్లినిక్‌లు

497

నాడు సేద్యానికి భరోసా.. నేడు తిరోగమనం

వైఎస్సార్‌సీపీ పాలనలో రైతుల భవితకు భరోసా కల్పిస్తూ ఆర్బీకేలు నిర్మించారు. ప్రస్తుతం రైతుల కు సేవలు అందడం లే దు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, సాగు సలహాలు ఇచ్చే అధికారులు అందుబాటులో లేక రైతులు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం రైతులకు అవసరమైన ఎరువులు విత్తనాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండడం లేదు. సకాలంలో విత్తనాలు, ఎరువులు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పుట్టి ధాన్యం రూ.28 వేల నుంచి రూ.29 వేలకు రైతులు విక్రయించారు. ప్రస్తుతం రూ.14 వేల నుంచి రూ.15 వేలకు ధాన్యం ధరలు పతనమయ్యాయి. నాడు భరోసా కల్పించిన సేవాలయాలు.. నేడు తిరోగమనం వైపు ప్రయనిస్తున్నాయి.

ఉదయగిరి: ఈ చిత్రంలో కనిపిస్తున్న డిజిటిల్‌ లైబ్రరీ వింజమూరు తహసీల్దార్‌ కార్యాలయం అవరణలో గత సార్వత్రిక ఎన్నికలకు ముందు రూ.17.50 లక్షలు ఖర్చు చేసి పూర్తి చేశారు. ఇంతలోనే సార్వత్రిక ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ప్రారంభానికి నోచుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక అధికార పార్టీ నేతలు చేసే పనులకు సిమెంట్‌ గోదాముగా మర్చారు. ఇందులో ప్రస్తుతం సిమెంటు బస్తాలు నిల్వ చేసి ఉన్నారు.

ఆత్మకూరు: కూటమి ప్రభుత్వం సచివాలయాలకు విలువ లేకుండా చేశారు. ఐదేళ్ల పాటు ప్రజలకు వందల రకాల సేవలు అందించే సచివాలయాల వ్యవస్థను ఈ ప్రభుత్వం నిర్వీ ర్యం చేసింది. కొన్ని మండలాల్లో సచివాలయాలను ఒకదానితో మరో గ్రామంలోని సచివాలయాన్ని కలిపేశారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని అనంతసాగరం మండలం కొత్తపల్లిలో గత ప్రభుత్వ కాలంలో అద్దె భవనంలో నిర్వహిస్తున్న సచివాలయాన్ని కూటమి ప్రభుత్వం అద్దె భవనం నుంచి సచివాలయాన్ని ఎత్తేశారు. రైతు సేవా కేంద్రంలో ఓ మూలగా సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ సచివాలయం పరిధిలో కొత్తపల్లి, కచ్చేరిదేవరాయపల్లి, వెంగంనాయుడుపల్లి, వడ్డిపాళెం, కాకూరువారిపల్లి గ్రామాలు ఉన్నాయి. అయితే సచివాలయాన్ని పంచాయతీ కార్యదర్శి, డిజిటల్‌ అసిస్టెంట్‌ ఇద్దరూ ఇన్‌చార్జిలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. సచివాలయంలోని కంప్యూటర్లు, ప్రింటర్‌ పూర్తిగా మరమ్మతులకు గురై మూలనపడ్డాయి. ఈ సచివాలయం పరిధిలోని ఐదు గ్రామాల ప్రజలకు సమస్యలు పరిష్కారం కావాలంటే దేవరాయపల్లి బిట్‌1 సచివాలయానికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

సచివాలయం ఎత్తేశారు1
1/8

సచివాలయం ఎత్తేశారు

సచివాలయం ఎత్తేశారు2
2/8

సచివాలయం ఎత్తేశారు

సచివాలయం ఎత్తేశారు3
3/8

సచివాలయం ఎత్తేశారు

సచివాలయం ఎత్తేశారు4
4/8

సచివాలయం ఎత్తేశారు

సచివాలయం ఎత్తేశారు5
5/8

సచివాలయం ఎత్తేశారు

సచివాలయం ఎత్తేశారు6
6/8

సచివాలయం ఎత్తేశారు

సచివాలయం ఎత్తేశారు7
7/8

సచివాలయం ఎత్తేశారు

సచివాలయం ఎత్తేశారు8
8/8

సచివాలయం ఎత్తేశారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement