ఆగి ఉన్న బస్సును ఢీకొన్న బైక్‌ | - | Sakshi
Sakshi News home page

ఆగి ఉన్న బస్సును ఢీకొన్న బైక్‌

May 2 2025 12:06 AM | Updated on May 2 2025 3:51 PM

-

తండ్రి, కుమార్తెకు గాయాలు

విడవలూరు(కొడవలూరు): ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును మోటార్‌బైక్‌ ఢీకొట్టగా ఇద్దరు గాయపడిన ఘటన కొడవలూరు మండలంలోని నాయుడుపాళెం వద్ద జాతీయ రహదారిపై గురువారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని యల్లాయపాళేనికి చెందిన మల్లిక మణి తన ఎనిమిదేళ్ల కుమార్తె లక్ష్మీతిరుపతమ్మను బైక్‌పై ఎక్కించుకొని కావలి వైపు వెళ్తూ నాయుడుపాళెం వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక వైపు నుంచి ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో మణికి తీవ్రంగా, లక్ష్మీతిరుపతమ్మ స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హైవే మొబైల్‌ సిబ్బంది నెల్లూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మణి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారని బంధువులు తెలిపారు. కొడవలూరు పోలీసులకు సమాచారం అందించారు.

నేటి నుంచి

సమ్మర్‌ క్యాంప్‌

వెంకటగిరి రూరల్‌: వేసవి సెలవులను పురస్కరించుకుని వెంకటగిరి పట్టణంలోని తారకరామా మైదానంలో ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ సహకారంతో సమ్మర్‌ క్యాంప్‌ నిర్వహించనున్నట్లు నెల్లూరు జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ నాయకులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 31వ తేదీ వరకు క్యాంప్‌ జరుగుతుందన్నారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 99597 22799 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

ఒక్కొక్కరుగా

మీడియా ముందుకు..

వీరయ్య కేసులో రోజుకొకరు

ముందుకొస్తున్న వైనం

కొనసాగుతున్న విచారణ

ఒంగోలు టౌన్‌: టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తొలుత మూడురోజులపాటు ఎటువంటి కదలిక కనిపించని ఈ కేసులో నిందితులు ఉపయోగించినట్లు చెబుతున్న వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్న తర్వాత నుంచి కీలక సమాచారం లభించడంతో వేగం పెరిగింది. అమ్మనబ్రోలుకు చెందిన టీడీపీ యువ నాయకుడిని ప్రధాన అనుమానితుడిగా పోలీసులు నిర్ధారించారు. ఇంకా అమ్మనబ్రోలుకు చెందిన హవాలా వ్యాపారి పేరు కూడా ప్రముఖంగా తెరపైకి వచ్చింది. హైదరాబాద్‌లో నివాసం ఉండే అతని కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఒంగోలు నగరం కొప్పోలులోని ఓ పాఠశాల సమీపంలో ఉంటున్న మరో వ్యక్తి హత్యలో ప్రధానపాత్ర పోషించినట్లు పోలీసులు చెబుతున్నారు. అతను హత్య జరిగిన రోజు రాత్రే వైజాగ్‌ పారిపోయినట్లు చెబుతున్న పోలీసులు.. అప్పటి నుంచి అక్కడే తిష్టవేసి గాలిస్తున్నారు. గత నెల 22వ తేదీ హత్య జరగ్గా, నేటికి పది రోజులు దాటిపోయాయి. అయినప్పటికీ కేసు మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. రెండు రోజుల క్రితం నెల్లూరు నుంచి ఇద్దరు అనుమానితులను తీసుకొచ్చి విచారిస్తున్నారు. వీరు హత్యలో నేరుగా పాల్గొన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా, ఈ కేసుకు సంబంధించి మూడు రోజులుగా పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధాన అనుమాని తులుగా చెప్పుకుంటున్న వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా మీడియా ముందుకు వస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement