
వైఎస్ జగన్ సమావేశానికి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి
నెల్లూరు (స్టోన్హౌస్పేట): వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన పార్టీ జిల్లాల అధ్యక్షుల సమావేశానికి నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి హాజరయ్యారు. మంగళవారం తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం జరిగింది. జిల్లాలో ప్రజల ఇబ్బందులు, రాజకీయ పరిస్థితులు, పార్టీ స్థితిగతులను అధినేత జగన్మోహన్రెడ్డి అడిగి తెలుసుకున్నారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. జిల్లాలో పార్టీ అధ్యక్షులే కీలకమని, పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని త్వరలో సభ్యత్వ నమోదు కార్యక్రమాలను చేపట్టాలని, కార్యకర్తలకు బీమా, తదితర అంశాలపై జగన్మోహన్రెడ్డి సమావేశంలో వివరించారని ఆయన తెలిపారు.
ఐటీఐ అడ్మిషన్లకు దరఖాస్తులు చేసుకోండి
నెల్లూరు (టౌన్): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో అడ్మిషన్ల కోసం మే 24వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఐటీఐల కన్వీనర్ కె.శ్రీధర్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఆన్లైన్ ద్వారా iti. ap. gov. in దరఖాస్తును పూర్తి చేయాలన్నారు. ఒరిజనల్ సర్టిఫికెట్లతో సమీపంలోని ప్రభుత్వ ఐటీఐలో మే 26వ తేదీలోపు ధ్రువీకరణ చేయించుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు కౌన్సెలింగ్ జరిగే తేదీలను సెల్ఫోన్లకు మెసేజ్లు పంపుతారన్నారు. సందేహాలు ఉంటే వెంకటేశ్వరపురం ప్రభుత్వ బాలుర ఐటీఐలో సంప్రదించాలన్నారు.