'గురి' అదిరింది.. పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం | Paris Olympics 2024: Manu Bhaker Wins Bronze Medal In Womens Shooting 10m Air Pistol Event, First Medal For India | Sakshi
Sakshi News home page

'గురి' అదిరింది.. పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం

Jul 28 2024 4:06 PM | Updated on Jul 28 2024 4:34 PM

Paris Olympics 2024: Manu Bhaker Wins Bronze Medal In Womens Shooting 10m Air Pistol Event, First Medal For India

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ తొలి పతకం సాధించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో మనూ బాకర్‌ కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఈ పోటీలో మనూ 221.7 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలువగా.. సౌత్‌ కొరియాకు చెందిన ఓ (243.2), కిమ్‌ (241.3) మొదటి రెండు స్థానాల్లో నిలిచి స్వర్ణ, రజత పతకాలు సొంతం చేసుకున్నారు. 

భారత్‌ తరఫున షూటింగ్‌లో పతకం సాధించిన తొలి మహిళగా మనూ చరిత్ర సృష్టించింది. 22 ఏళ్ల మనూ హర్యానాకు చెందిన యువతి. మనూ తండ్రి మెరైన్‌ ఇంజనీర్‌ కాగా.. తల్లి ప్రిన్సిపల్‌. మనూ.. 2018 కామన్‌వెల్త్‌ క్రీడల్లో 16 ఏళ్ల వయసులోనే స్వర్ణ పతకం సాధించింది. మనూ అర్జున అవార్డు గ్రహీత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement